Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియో ఫోన్ 3 పేరుతో టచ్ ఫోన్.. రిలయన్స్ దృష్టి

Webdunia
బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (15:35 IST)
భారత టెలికాం రంగంలో 2016లో వచ్చిన జియో భారీ మార్పులను తీసుకొచ్చింది. మార్కెట్‌లోకి వచ్చిన కొన్ని మాసాలకే ప్రముఖ సంస్థలతో పోటీ పడుతూ వినియోగదారుల చేరికలో ప్రపంచంలో ఎప్పుడూ లేని విధంగా రికార్డ్‌ను నెలకొల్పింది. అలాగే జియో ఫోన్ పేరుతో ఫీచర్ ఫోన్‌ని మార్కెట్‌లోకి విడుదల చేసింది. 
 
సామాన్యులకు అందుబాటులో ఉండే ధరతో మొబైల్ సేవలను మరింత దగ్గర చేసింది. ఫీచర్ ఫోన్ మార్కెట్‌లో క్వెర్టీ మోడల్‌ని కూడా రిలీజ్ చేసింది. అయితే ఇప్పుడు స్మార్ట్ ఫీచర్లతో అందుబాటు ధరలో ఉండేలా స్మార్ట్‌ఫోన్‌ని తీసుకురావడానికి సిద్ధమవుతోంది. మరికొన్ని నెలల్లో రిలయన్స్ వార్షిక సమావేశం జరగనుండగా జియోఫోన్ 3 ఆవిష్కరణపై పలు ఊహాగానాలు ఊపందుకున్నాయి.
 
5 అంగుళాల టచ్ స్క్రీన్‌తో పాటు పవర్‌ఫుల్ సాఫ్ట్‌వేర్ సాయంతో జియో ఫోన్ 3 చాలా స్మార్ట్‌గా ఆవిష్కృతం కానుంది. ఆండ్రాయిడ్ గో ఆధారంగా పని చేస్తూ, 2 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజీ సామర్థ్యంతో ఈ స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేయనున్నట్లు అంచనా. 
 
అంతేకాకుండా 5 ఎంపీ రియర్ కెమెరా, 2 ఎంపీ ఫ్రంట్ కెమెరాను పొందుపరచినట్లు తెలుస్తోంది. ఇక జియో ఫోన్ ధర రూ.4,500కు ఉండవచ్చని అంచనా. ఈ యేడాది జూన్‌లో జరుగనున్న రిలయన్స్ జియో వార్షిక సమావేశంలో జియో ఫోన్ 3ని వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments