Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్‌-2020 నిరవధిక వాయిదా.. బీసీసీఐ ప్రకటన

Webdunia
బుధవారం, 15 ఏప్రియల్ 2020 (22:58 IST)
కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ ఈ ఏడాది కరోనా కారణంగా జరుగుతుందా లేదా అనే దానిపై బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. ఇందులో భాగంగా కరోనా విజృంభించడంతో ఐపీఎల్‌-2020 నిరవధికంగా వాయిదా వేస్తూ బీసీసీఐ ప్రకటించింది. ఈ ఏడాది ఐపిఎల్‌ మార్చి 29నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. కోవిడ్‌-19 కారణంగా 21 రోజుల లాక్‌డౌన్‌తో ఈ టోర్నీని ఏప్రిల్‌ 15వరకూ తొలిసారి వాయిదా వేశారు. 
 
మంగళవారం ప్రధాని లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. 'ఐపిఎల్‌ నిరవధిక వాయిదా గురించి బోర్డు మాకు సమాచారమిచ్చింది. పరిస్థితులు సద్దుమణిగాక ఈ ఏడాది చివర్లోనైనా విండో లభిస్తుందని ఆశిస్తున్నాం' అని ఓ ఫ్రాంచైజీ సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు.
 
కాగా.. 2008లో ఐపిఎల్‌ ఆరంభమయ్యాక ఏప్రిల్‌-మే విండోను కోల్పోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. మరోవైపు టి20 ప్రపంచకప్‌ వాయిదా పడితే సెప్టెంబర్‌లో ఐపిఎల్‌ను ఆడిస్తారనే కథనాలు వినిపిస్తున్నాయి. ఈ సీజన్‌ ఐపిఎల్‌పై మే 3 తర్వాతే తుది నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

న్యూస్ రీల్ మాత్రమే చూశారు .. అసలైన సినిమా ముందుంది : నితిన్ గడ్కరీ

ప్రియురాలని ఇంప్రెస్ చేద్దామనుకుని జైలుపాలైన ప్రియుడు!

Iran: ముగ్గురు సీనియర్ కమాండర్లను హతమార్చిన ఇజ్రాయేల్

హాట్ ఎయిర్ బెలూన్‌లో మంటలు - 8 మంది మృత్యువాత

ఎయిరిండియా విమానమా? సిటీ బస్సా? గాల్లో ఎగురుతుండగా కిర్రుకిర్రుమంటూ విమానం తలుపు శబ్దం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

తర్వాతి కథనం
Show comments