Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్‌-2020 నిరవధిక వాయిదా.. బీసీసీఐ ప్రకటన

Webdunia
బుధవారం, 15 ఏప్రియల్ 2020 (22:58 IST)
కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ ఈ ఏడాది కరోనా కారణంగా జరుగుతుందా లేదా అనే దానిపై బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. ఇందులో భాగంగా కరోనా విజృంభించడంతో ఐపీఎల్‌-2020 నిరవధికంగా వాయిదా వేస్తూ బీసీసీఐ ప్రకటించింది. ఈ ఏడాది ఐపిఎల్‌ మార్చి 29నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. కోవిడ్‌-19 కారణంగా 21 రోజుల లాక్‌డౌన్‌తో ఈ టోర్నీని ఏప్రిల్‌ 15వరకూ తొలిసారి వాయిదా వేశారు. 
 
మంగళవారం ప్రధాని లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. 'ఐపిఎల్‌ నిరవధిక వాయిదా గురించి బోర్డు మాకు సమాచారమిచ్చింది. పరిస్థితులు సద్దుమణిగాక ఈ ఏడాది చివర్లోనైనా విండో లభిస్తుందని ఆశిస్తున్నాం' అని ఓ ఫ్రాంచైజీ సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు.
 
కాగా.. 2008లో ఐపిఎల్‌ ఆరంభమయ్యాక ఏప్రిల్‌-మే విండోను కోల్పోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. మరోవైపు టి20 ప్రపంచకప్‌ వాయిదా పడితే సెప్టెంబర్‌లో ఐపిఎల్‌ను ఆడిస్తారనే కథనాలు వినిపిస్తున్నాయి. ఈ సీజన్‌ ఐపిఎల్‌పై మే 3 తర్వాతే తుది నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments