Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గుజరాత్ ముఖ్యమంత్రికి కరోనా వైరస్ సోకిందా?

గుజరాత్ ముఖ్యమంత్రికి కరోనా వైరస్ సోకిందా?
, బుధవారం, 15 ఏప్రియల్ 2020 (16:25 IST)
గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీకి కరోనా వైరస్ సోకిందా? సీఎంతో పాటు.. మరో ఇద్దరు మంత్రులతో సమావేశమైన తర్వాత ఓ ఎమ్మెల్యేలో కరోనా వైరస్ లక్షణాలు కనిపించాయి. దీంతో ముఖ్యమంత్రితో పాటు.. సీఎం కార్యాలయ సిబ్బంది కూడా హడలిపోతున్నారు. 
 
గుజరాత్‌కు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఇమ్రానా ఖేడావాలాకు కొద్దిరోజులుగా జ్వరం వస్తున్నది. దాంతో ఆయన కరోనా పరీక్షలకు శాంపిల్ ఇచ్చారు. అయినా ఇంటిపట్టున ఉండకుండా బయట తిరుగుతున్నారు. 
 
ఈ క్రమంలో ఆయన ముఖ్యమంత్రి విజయ్ రూపానీతో పాటు మరో ఇద్దరు మంత్రులతో సమావేశమయ్యారు. సీఎం దగ్గరకు వెళ్లడమేకాకుండా తర్వాత ఓ మీడియా సమావేశంలో కూడా ఆయన పాల్గొన్నారు. ఎట్టకేలకు కరోనా నిర్ధారణ కావడంతో ఆయన గాంధీనగర్‌లోని ఎస్వీపీ హాస్పిటల్‌లో చికిత్స నిమిత్తం చేరారు. 
 
ఆయన ఇంకా ఎంతమందిని కలిశారో తెలియడం లేదు. వారందరినీ వెతికి క్వారంటైన్‌లో ఉంచడం అధికారులకు తలనొప్పిగా మారింది. ఎమ్మెల్యే వ్యవహారంపై రాష్ట్ర సర్కారు ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టు తెలిసింది. ఈ ఉదయం సీఎంతోనూ, ఆరోగ్య, హోంశాఖ మంత్రులతోనూ ఎమ్మెల్యే జరిపిన సమావేశం వీడియోను అధికారులు పరిశీలించగా అందులో పాల్గొన్నవారంతా సామాజిక దూరాన్ని పాటించినట్టు తెలిసింది. దీంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లాక్‌డౌన్ ఎత్తివేసే ముందు ఇలా చేయండి.. డబ్ల్యూహెచ్ఓ సూచన