Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండో-పాక్ సరిహద్దు వద్ద మగబిడ్డకు జన్మనిచ్చిన పాకిస్థానీ మహిళ.. "బోర్డర్"

Webdunia
సోమవారం, 6 డిశెంబరు 2021 (17:01 IST)
భారత్-పాకిస్థాన్ సరిహద్దు వద్ద పాకిస్థానీ మహిళ ఓ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డకు భారత-పాకిస్థాన్ సరిహద్దుల్లో జన్మించిన కారణంగా.. బోర్డర్ అనే పేరు పెట్టారు. వివరాల్లోకి వెళితే.. నింబు బాయి అనే మహిళ అట్టారి సరిహద్దు వద్ద మగబిడ్డకు జన్మనిచ్చింది. 
 
భర్త బలం రామ్‌తో కలిసి సరిహద్దు వద్ద గూడారంలో వుంటున్న ఆమెకు పురిటినొప్పులు రావడంతో.. ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ శిశువుకు బోర్డర్ అనే పేరు కూడా పెట్టడం జరిగింది. భార్య ప్రసవం కోసం పంజాబ్ పొరుగు ప్రాంతాలలోని మహిళల నుండి, ఇతర గ్రామస్థుల నుండి సహాయం పొందాడు. అంతేగాకుండా సరిహద్దుల వద్ద ఆ బిడ్డ పుట్టడంతో గూడారంలో వుంటున్న ప్రజలు పండుగ చేసుకున్నారు.  
 
ఇకపోతే.. 97 మంది పాకిస్తాన్ పౌరులు తీర్థయాత్ర, భారతదేశంలో నివసిస్తున్న తమ బంధువులను కలవడానికి భారతదేశాన్ని సందర్శించారు. అయితే తమ దేశంలోకి ప్రవేశించడానికి అవసరమైన పత్రాలు లేకపోవడం వల్ల పాకిస్తాన్‌కు తిరిగి చేరుకోలేకపోయారు. 
 
ఇలా అట్టారి సరిహద్దు దాటలేని ప్రజలందరూ అంతర్జాతీయ చెక్ పోస్ట్ సమీపంలోని గుడారంలో ఉంటున్నారు. వారికి అక్కడి స్థానికులు ఆహారం, వైద్య సదుపాయాలను అందిస్తారు. ఈ గూడారంలో వుంటున్న మహిళే మగబిడ్డను ప్రసవించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments