Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైనికుల ఆత్మరక్షణ కోసమే కాల్పులు.. ఘటన విచారకరం: అమిత్ షా

Webdunia
సోమవారం, 6 డిశెంబరు 2021 (16:17 IST)
నాగాలాండ్ రాష్ట్రంలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో 14 మంది సాధారణ పౌరులు మృత్యువాతపడ్డారు. దీనిపై కేంద్ర హోం శాఖామంత్రి అమిత్ షా సోమవారం లోక్‌సభలో ఒక ప్రకటన చేశారు. ఆత్మరక్షణ కోసమే సైనిక బలగాలు కాల్పులు జరిపాయని వెల్లడించారు. 
 
పైగా, నాగాలాండ్‌లో ప్రస్తుత పరిస్థితి అదుపులోనే వుందని సభకు తెలిపారు. అంతేకాకుండా, నాగాలాండ్ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశామనీ  బృందం వచ్చే 30 రోజుల్లో నివేదిక ఇస్తుందని తెలిపారు. పైగా, నాగాలాండ్ ఘటనపై తాము రాష్ట్ర ఉన్నతాధికారులతో కూడా మాట్లాడినట్టు చెప్పారు. 
 
కాగా, నాగాలాండ్‌లో భద్రతా బలగాలు పొరపాటు తీవ్రవాదులుగా పొరపడి సామాన్య పౌరులపై కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో 14 మంది మృత్యువాతపడ్డారు. ఈ విషయం తెలుసున్న స్థానికులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఈ ఘటన స్థానికంగా భగ్గుమనేలా చేసింది. 
 
మరోవైపు, ఈ ఘటనపై సైన్యం కూడా ఓ ప్రకటన విడుదల చేసింది. సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోవడంపై తీవ్ర విచారం వ్యక్తం చేసిందని చెప్పారు. ఈ దురదృష్టకర ఘటనపై సైన్యం కూడా ఉన్నత స్థాయి విచారణ జరుపుతుందని మంత్రి అమిత్ షా వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ కాలికి స్వల్ప గాయాలు.. రెండు వారాల పాటు విశ్రాంతి (video)

Akella: ఆకెళ్ల సూర్యనారాయణ ఇక లేరు

Washi Yo Washi from OG: పవన్ పాడిన వాషి యో వాషి సాంగ్ రిలీజ్.. ఫ్యాన్స్‌కు మెగా విందు

Bhadrakali review: సమకాలీన రాజకీయచతురతతో విజయ్ ఆంటోని భద్రకాళి చిత్రం రివ్యూ

Kiran Abbavaram: కేరళ బ్యాక్ డ్రాప్ లో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కామెర్ల వ్యాధితో రోబో శంకర్ కన్నుమూత, ఈ వ్యాధికి కారణాలు, లక్షణాలేమిటి?

రీస్టార్ట్ విత్ ఇన్పోసిస్.. మహిళా ఉద్యోగులకు శుభవార్త.. ఏంటది?

యాలకలు 6 ప్రయోజనాలు, ఏంటవి?

పండుగ కలెక్షన్ మియారాను విడుదల చేసిన తనైరా

సర్జికల్ రోబోటిక్స్‌లో భారతదేశం యొక్క తదుపరి ముందడుగు: అధునాతన సాఫ్ట్ టిష్యూ రోబోటిక్ సిస్టమ్‌

తర్వాతి కథనం
Show comments