Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైనికుల ఆత్మరక్షణ కోసమే కాల్పులు.. ఘటన విచారకరం: అమిత్ షా

Webdunia
సోమవారం, 6 డిశెంబరు 2021 (16:17 IST)
నాగాలాండ్ రాష్ట్రంలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో 14 మంది సాధారణ పౌరులు మృత్యువాతపడ్డారు. దీనిపై కేంద్ర హోం శాఖామంత్రి అమిత్ షా సోమవారం లోక్‌సభలో ఒక ప్రకటన చేశారు. ఆత్మరక్షణ కోసమే సైనిక బలగాలు కాల్పులు జరిపాయని వెల్లడించారు. 
 
పైగా, నాగాలాండ్‌లో ప్రస్తుత పరిస్థితి అదుపులోనే వుందని సభకు తెలిపారు. అంతేకాకుండా, నాగాలాండ్ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశామనీ  బృందం వచ్చే 30 రోజుల్లో నివేదిక ఇస్తుందని తెలిపారు. పైగా, నాగాలాండ్ ఘటనపై తాము రాష్ట్ర ఉన్నతాధికారులతో కూడా మాట్లాడినట్టు చెప్పారు. 
 
కాగా, నాగాలాండ్‌లో భద్రతా బలగాలు పొరపాటు తీవ్రవాదులుగా పొరపడి సామాన్య పౌరులపై కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో 14 మంది మృత్యువాతపడ్డారు. ఈ విషయం తెలుసున్న స్థానికులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఈ ఘటన స్థానికంగా భగ్గుమనేలా చేసింది. 
 
మరోవైపు, ఈ ఘటనపై సైన్యం కూడా ఓ ప్రకటన విడుదల చేసింది. సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోవడంపై తీవ్ర విచారం వ్యక్తం చేసిందని చెప్పారు. ఈ దురదృష్టకర ఘటనపై సైన్యం కూడా ఉన్నత స్థాయి విచారణ జరుపుతుందని మంత్రి అమిత్ షా వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాన్నా పవన్... మా సమస్యలు ఓ సారి వినరాదూ!! : డిప్యూటీ సీఎంకు పరుచూరి విన్నపం (Video)

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments