Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాగాలాండ్ పౌరులపై ఉద్దేశ్వపూర్వకంగా కాల్పులు!!

నాగాలాండ్ పౌరులపై ఉద్దేశ్వపూర్వకంగా కాల్పులు!!
, సోమవారం, 6 డిశెంబరు 2021 (10:54 IST)
ఈశాన్య భారత రాష్ట్రాల్లో ఒకటైన నాగాలాండ్‌ రాష్ట్రంలోని మోను జిల్లా థిరు, ఒటింగ్ గ్రామాల్లో తీవ్రవాదులుగా భావించి సాధారణ పౌరులపై భద్రతా బలగాలు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 12 మంది సాధారణ పౌరులు మృత్యువాతపడ్డారు. అలాగే, కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ పౌరులపై భద్రతా బలగాలు ఉద్దేశ్యపూర్వకంగానే కాల్పులు జరిపారంటూ స్థానికులు ఆరోణలు చేస్తున్నారు. 
 
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనపై పూర్తి స్థాయిలో సమగ్రంగా దర్యాప్తు జరిపేందుకు నాగాలాండ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటుచేసింది. ఆ వెంటనే రంగంలోకి దిగిన సిట్ అధికారుల ప్రాథమిక దర్యాప్తులో భద్రతా బలగాలు ఉద్దేశ్యపూర్వకంగానే కాల్పులు జరిపినట్టు వెల్లడైంది. 
 
దీంతో కాల్పులు జరిపిన 15 మంది సైనికులపై హత్యా నేరం కింద కేసు నమోదు చేశారు. వీరిలో ఒకరు చనిపోయిన మేజర్ కూడా ఉన్నారు. స్థానికులను గాయపర్చడం లేదా చంపివేయాలనే కారణంతోనే ఆర్మీ జవాన్లు ఈ కాల్పులకు తెగబడినట్టు సిట్ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా త‌యారైన నేటి పాలకులు