Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్యంత భయానకంగా లెబనాన్.. ఎక్కడ చూసినా మృతదేహాలు...

Webdunia
గురువారం, 6 ఆగస్టు 2020 (14:37 IST)
లెబనాన్‌ రాజధాని బీరూట్‌ అత్యంత భయానకంగా మారింది. నగరంలోని పోర్టు ప్రాంతంలో మంగళవారం సాయంత్రం జరిగిన భారీ పేలుళ్లతో పలు భవనాలు నేలమట్టమయ్యాయి. ఎక్కడ చూసినా మృతదేహాలతో బీరూట్‌ మృత్యునగరాన్ని తలపించింది. ఈ ఘటనలో దాదాపు 137 మంది మరణించారు. నాలుగు వేల మందికిపైగా గాయపడ్డారు. 
 
శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు సహాయ కార్యక్రమాలు సాగుతున్నాయి. కాగా పోర్టు ప్రాంతంలోని ఓ గోదాములో నిల్వ ఉంచిన 2700 టన్నుల అమ్మోనియం నైట్రేట్‌ వల్లే ఈ పేలుళ్లు జరిగాయని మంత్రి మొహమ్మద్‌ ఫామీ తెలిపారు.
 
2013లో అక్రమంగా రసాయనాలను తరలిస్తున్న ఓ కార్గో నౌకను అధికారులు సీజ్‌ చేసి ఓడలోని అమ్మోనియం నైట్రేట్‌, ఇతర రసాయనాలను గోదాముకు తరలించారు. అప్పటి నుంచి ఆ రసాయనాలు అక్కడే నిల్వ ఉన్నాయని ఫామీ వెల్లడించారు. గతంలో ఎన్నడూ చూడనటువంటి విపత్తును తాము ఎదుర్కొన్నామని లెబనాన్‌ ప్రధాని హసాన్‌ దియాబ్‌ తెలిపారు.
 
పేలుళ్లతో తీవ్రంగా దెబ్బతిన్న లెబనాన్‌ వంటి చిన్న దేశానికి మిత్ర దేశాలు సాయాన్ని అందించాలని ప్రధాని హసాన్ విజ్ఞప్తి చేశారు. లెబనాన్‌కు సాయాన్ని అందించేందుకు ఇప్పటికే రష్యా ముందుకొచ్చింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments