Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్వారంటైన్ కేంద్రం నుండి పరారైన మర్డర్ కేసు కరోనాపాజిటివ్ నిందితుడు, ఎక్కడ?

Webdunia
గురువారం, 6 ఆగస్టు 2020 (14:31 IST)
కరోనావైరస్ పోలీసులకు కొత్త కష్టాన్ని తెచ్చి పెట్టింది. ఒక ప్రక్క కరోనా సోకి కొంతమంది పోలీసులు బాధపడుతంటే మరో ప్రక్క కరోనా సోకిన ఖైదీలను పారిపోకుండా ఆపడానికి నానా తంటాలు పడాల్సి వస్తుంది. ఇక అలాంటి ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకున్నది. కరోనా పాజిటివ్‌తో బాధపడుతున్న ఒక మర్డర్ కేసు నిందితుడు క్వారంటైన్ కేంద్రం నుండి తప్పించుకొని పారిపోయాడు.
 
ఇటువంటి ఘటనలు పోలీసులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. మాచవరం పోలీసు స్టేషన్ పరిధిలో ఒక నూడిల్స్ బండి యజమానిని మర్డర్ చేసిన కేసులో ముద్దాయిగా ఉన్న వ్యక్తి ప్రస్తుతం గన్నవరం సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. అయితే అతనికి కరోనా సోకడంతో కంకిపాడు మండలంలోని ఈడుపుగల్లు క్వారంటైన్ కేంద్రానికి తరలించారు.
 
నిన్న సాయంత్రం నుండి క్వారంటైన్ కేంద్రంలో ఉన్న నిందితుడు రాత్రి 10 గంటల సమయంలో క్వారంటైన్ కేంద్రం నుండి తప్పించుకొని పారిపోయాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. తప్పించుకొన్న నిందితుడు పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి సమీపంలోని లింగపల్లి గ్రామానికి చేందినవాడని పోలీసులు తెలిపారు.
 
తప్పించుకున్న నిందితుడు కరోనా బాధితుడు కావడంతో అతని ద్వారా కరోనా ఎంతమందికి సోకుతుందోన్న భయాందోళనల మధ్య పోలీసులు తీవ్ర గాలింపు చర్యను చేపట్టారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments