Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్వారంటైన్ కేంద్రం నుండి పరారైన మర్డర్ కేసు కరోనాపాజిటివ్ నిందితుడు, ఎక్కడ?

Webdunia
గురువారం, 6 ఆగస్టు 2020 (14:31 IST)
కరోనావైరస్ పోలీసులకు కొత్త కష్టాన్ని తెచ్చి పెట్టింది. ఒక ప్రక్క కరోనా సోకి కొంతమంది పోలీసులు బాధపడుతంటే మరో ప్రక్క కరోనా సోకిన ఖైదీలను పారిపోకుండా ఆపడానికి నానా తంటాలు పడాల్సి వస్తుంది. ఇక అలాంటి ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకున్నది. కరోనా పాజిటివ్‌తో బాధపడుతున్న ఒక మర్డర్ కేసు నిందితుడు క్వారంటైన్ కేంద్రం నుండి తప్పించుకొని పారిపోయాడు.
 
ఇటువంటి ఘటనలు పోలీసులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. మాచవరం పోలీసు స్టేషన్ పరిధిలో ఒక నూడిల్స్ బండి యజమానిని మర్డర్ చేసిన కేసులో ముద్దాయిగా ఉన్న వ్యక్తి ప్రస్తుతం గన్నవరం సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. అయితే అతనికి కరోనా సోకడంతో కంకిపాడు మండలంలోని ఈడుపుగల్లు క్వారంటైన్ కేంద్రానికి తరలించారు.
 
నిన్న సాయంత్రం నుండి క్వారంటైన్ కేంద్రంలో ఉన్న నిందితుడు రాత్రి 10 గంటల సమయంలో క్వారంటైన్ కేంద్రం నుండి తప్పించుకొని పారిపోయాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. తప్పించుకొన్న నిందితుడు పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి సమీపంలోని లింగపల్లి గ్రామానికి చేందినవాడని పోలీసులు తెలిపారు.
 
తప్పించుకున్న నిందితుడు కరోనా బాధితుడు కావడంతో అతని ద్వారా కరోనా ఎంతమందికి సోకుతుందోన్న భయాందోళనల మధ్య పోలీసులు తీవ్ర గాలింపు చర్యను చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

పవన్ కళ్యాణ్ ఓ పొలిటికల్ తుఫాను : రజనీకాంత్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments