Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిమ్ సర్కారు ఘాతుకం.. దక్షిణ కొరియా అధికారిని చంపడమే కాకుండా నిప్పంటించి..?

Webdunia
గురువారం, 24 సెప్టెంబరు 2020 (15:16 IST)
ఉత్తర కొరియాలోని కిమ్ జాంగ్ సర్కారు మరో ఘాతుకానికి పాల్పడింది. తమ దేశానికి చెందిన ఒక అధికారిని ఉత్తర కొరియా బలగాలు కాల్చి చంపాయని దక్షిణ కొరియా తెలిపింది. ఇరుదేశాల మధ్య ఉన్న వివాదాస్పద సముద్ర జలాల బోర్డర్ పరిధిలో నీటిలో తేలుతున్న చిన్నపడవపై కాల్చేసిన తమ అధికారి శవం ఉన్నట్టు దక్షిణ కొరియా ప్రభుత్వం గుర్తించింది. సరిహద్దుకు దక్షిణంగా ఉన్న ప్రాంతంలో అనధికార చేపల వేటను నియంత్రించడానికి పంపిన బృందంలోని ఆ అధికారి అనుకోని రీతిలో ప్రభుత్వ ఓడ నుంచి అదృశ్యమయ్యాడని తెలుస్తోంది.
 
మంగళవారం మధ్యాహ్నం దక్షిణ కొరియా అధికారి వెళ్లిన ప్రాంతానికి గ్యాస్ మాస్కులు ధరించిన తమ అధికారులను ఉత్తర కొరియా పంపింది. చంపిన తరువాత బాధితుడి శరీరంపై గ్యాసోలిన్ పోసి నిప్పంటించారని దక్షిణ కొరియా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
 
చనిపోయిన అధికారి ఉత్తరం వైపు వెళ్లడానికి ఎందుకు ప్రయత్నించాడనేది ప్రశ్నార్థకంగా మారింది. బాధితుడు అక్రమంగా ఉత్తర కొరియాలోకి వెళ్లడానికి ప్రయత్నించినట్టు తెలుస్తోంది. అతడు లైఫ్ జాకెట్ ధరించి, ఒక చిన్న పడవపై ప్రయాణిస్తుండగా ఉత్తర కొరియా నేవీ సిబ్బంది గుర్తించి పట్టుకున్నారని పేరు వెల్లడించని దక్షిణ కొరియా అధికారి ఒకరు చెప్పారు.  
 
తమ దేశంలో ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదుకాలేదని ఉత్తర కొరియా చెబుతోంది. కానీ ఈ వాదనను విదేశీ నిపుణులు ఖండిస్తున్నారు. ఆ దేశంలో ప్రజారోగ్య వ్యవస్థ సక్రమంగా ఉండదు. దీనికి తోడు వైద్య సామగ్రి కొరత కూడా ఉంటుంది. దీంతో అక్కడ కరోనా మహమ్మారి వ్యాపిస్తే, దాని పరిణామాలు తీవ్రంగా ఉండే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. ఇప్పటికే కరోనా వచ్చిన వారిని కాల్చి చంపాలని ఉత్తర కొరియా అధికారులను కిమ్ ఆదేశించాడు. ఇందులో భాగంగానే అక్రమంగా సరిహద్దులు దాటి రావాలనుకున్న బాధితుడిని సైతం కాల్చి నిప్పంటించినట్టు తెలుస్తోంది.
 
తప్పిపోయిన అధికారి సమాచారం గురించి బుధవారం దక్షిణ కొరియా దాయాది దేశాన్ని సంప్రదించింది. అమెరికా ఆధ్వర్యంలో పనిచేసే యూఎన్ కమాండ్ కమ్యూనికేషన్ ఛానల్ ద్వారా ఉత్తర కొరియాకు సందేశం పంపింది. కానీ ఆ దేశం స్పందించలేదని దక్షిణ కొరియా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments