Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌కు చుక్కలు చూపిస్తున్న బలూచిస్థాన్ - ఇటు భారత్ కూడా..

ఠాగూర్
సోమవారం, 5 మే 2025 (10:40 IST)
పాకిస్థాన్‌కు తిరుగుబాటుదారులు బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ చుక్కలు చూపిస్తోంది. దీంతో పాకిస్థాన్‌లో అంతర్యుద్ధం మొదలైంది. పాకిస్థాన్ సైనికులను హతమారుస్తూ ఆ ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తోంది. తమ ప్రాంతాన్ని వీడి వెళ్లాలంటూ పాక్, చైనా బలగాలకు బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ హెఛ్చరించింది. ఇప్పటికే పాక్‌లోని మంగుచోర్ ప్రాంతాన్ని బీఎల్ఏ స్వాధీనం చేసుకుంది. పైగా, తమ ప్రాంతాన్ని స్వతంత్ర దేశంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తోంది. దీంతో గత కొంతకాలంగా పాకిస్థాన్‌లో అంతర్యుద్ధం కొనసాగుతోంది. ఏకంగా పాకిస్థాన్ సైనికులను హతమార్చుతూ పాక్ రక్షణ శాఖకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.
 
మరోవైపు, పహల్గాం దాడి తర్వాత భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌కు గుణపాఠం నేర్పేందుకు భారత్ సన్నద్ధమవుతోంది. భారత రక్షణ శాఖకు చెందిన త్రివిధ దళాలు ఏ క్షణమైనా పాకిస్థాన్‌పై దాడి చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో పాకిస్థాన్‌ పాలకులకు కంటిమీద కునుకులేకుండా పోయింది. అటు బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ, ఇటు భారత బలగాల దాడి నుంచి ఎలా తప్పించుకోవాలన్న అంశంపై మల్లగుల్లాలు పడుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments