అమేజాన్ ఆదివాసీలకు కూడా కరోనా.. ఏడుగురికి పాజిటివ్

Webdunia
గురువారం, 9 ఏప్రియల్ 2020 (13:06 IST)
అమేజాన్ అటవీ ప్రాంతంలో నివసించే ఆదివాసీలకు కూడా కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో బ్రెజిల్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. యానోమామి అనే తెగకు చెందిన ఈ ఆదివాసీల్లో ఏడుగురికి కరోనా కేసులు కన్ఫామ్ అయినట్లు బ్రెజిల్ ఆరోగ్య శాఖ మంత్రి లూయిజ్ హెన్రిక్ మాండెట్టా వెల్లడించారు.

బ్రెజిల్ అటవీ ప్రాంతాల్లో 300కి పైగా వివిధ తెగలకు చెందిన 18 లక్షల మంది నివసిస్తున్నారు. నాగరిక సమాజానికి దూరంగా ఉంటున్న ఈ తెగల్లో యానోమామికి చెందిన 27 వేల మంది ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. 
 
బయటి ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేని ఈ తెగకు కరోనా సోకడం ఆశ్చర్యంగా వుందని లూయిజ్ హెన్రిక్ అన్నారు. వీరికే ఈ మహమ్మారి సోకిందంటే మనం మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడిందని లూయజ్ వెల్లడించారు. 
 
యానోమామి తెగకు చెందిన 15 ఏళ్ళ కుర్రాడికి ఈ వైరస్ సోకగా ఆసుపత్రిలో ఐసీయులో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. మొదట వారం రోజుల క్రితం 'కోకామా' తెగకు చెందిన 20ఏళ్ళ మహిళకు కరోనా సోకింది. బ్రెజిల్‌లో కూడా రోజురోజుకీ కరోనా మృతుల సంఖ్య పెరుగుతోంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దేశీ ప్రిన్సెస్‌'లా మెరిసిపోతున్న జాన్వీ కపూర్

Nani: 150 మిలియన్+ వ్యూస్ తో నాని ది ప్యారడైజ్ ఆయా షేర్ సాంగ్

Devi Sri Prasad: ఎల్లమ్మ చేయడానికి స్ఫూర్తిని ఇచ్చిన గ్రామం వెదురుపాక: దేవిశ్రీ ప్రసాద్

Karthi: ఈ ఏడాది చిత్రాల సందడితో 49వ పుట్టినరోజు జరుపుకుంటున్న కార్తి

కెమెరాతో కథ చెప్పాలి, రీ-రికార్డింగ్‌కి కూడా కథలో స్పేస్ ఉండాలి : కెమెరామెన్ రత్నవేలు

తర్వాతి కథనం
Show comments