Webdunia - Bharat's app for daily news and videos

Install App

తేనెను వేడి చేసి అందులో రెండు స్పూన్ల దాల్చిన చెక్క పొడిని కలిపి...(video)

Webdunia
శుక్రవారం, 2 ఏప్రియల్ 2021 (22:52 IST)
సాధారణంగా మహిళలు రుతుసమయంలో వచ్చే నొప్పులతో బాధపడుతుంటారు. ఆ సమస్య నుండి బయటపడాలంటే బియ్యం కడిగిన నీటిలో మూడు స్పూన్ల దాల్చిన చెక్క పొడి వేసి త్రాగితే ఫలితం ఉంటుంది.
 
కొన్ని సందర్భాలలో కొంత మందికి గుండె పట్టేసినట్లు ఉంటుంది. అలాంటప్పుడు దాల్చిన చెక్కను మెత్తగా పొడి చేసి అందులో యాలకుల పొడిని కూడా కలిపి నీటిలో వేసి మరిగించాలి. ఈ మిశ్రమాన్ని కషాయం రూపంలో త్రాగితే తక్షణమే ఉపశమనం కలుగుతుంది.
 
తలనొప్పి తగ్గాలంటే దాల్చిన చెక్క చూర్ణాన్ని నీటిలో కలిపి పేస్ట్‌లా చేసి నుదుటిపై రాసుకుంటే సరిపోతుంది.
 
చెడు కొలెస్ట్రాల్ తగ్గాలంటే దాల్చిన చెక్క పొడిలో కొద్దిగా తేనె కలుపుకుని రోజూ మూడుసార్లు క్రమం తప్పకుండా తీసుకుంటే మంచిది.
 
తేనెను వేడి చేసి అందులో రెండు స్పూన్ల దాల్చిన చెక్క పొడిని కలిపి చర్మానికి రాసుకున్నా లేదా సేవించినా దురదలు, చెమట పొక్కులు, ఎగ్జిమా నుండి ఉపశమనం పొందవచ్చు.
 
రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు గ్లాసు పాలలో 2 స్పూన్ల దాల్చిన చెక్క పొడి, కొద్దిగా చక్కెర వేసి తీసుకుంటే జ్ఞాపకశక్తి మెరుగవుతుంది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

నాకు జగన్ అంటే చాలా ఇష్టం.. ఆయనలో ఆ లక్షణాలున్నాయ్: కల్వకుంట్ల కవిత

పోలీసులను బట్టలూడదీసి కొడతారా? జగన్ క్షమాపణలు చెప్పాల్సిందే: పురంధేశ్వరి

హైదరాబాద్ రెస్టారెంట్‌‌లో బంగారు పూత పూసిన అంబానీ ఐస్ క్రీమ్ (video)

పోసాని కృష్ణ మురళికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట.. ఈ నెల 24కి విచారణ వాయిదా

రీల్స్ కోసం రైలు పట్టాలపై పడుకున్నాడు.. కదిలే రైలు అతనిపై నుంచి పోయింది.. (వీడియో)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

తర్వాతి కథనం
Show comments