Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఫోన్లో రొమాన్స్‌గా పిలిచిన ఆంటీ, పరుగెత్తుకుని వెళ్ళిన యువకుడి అంతం

ఫోన్లో రొమాన్స్‌గా పిలిచిన ఆంటీ, పరుగెత్తుకుని వెళ్ళిన యువకుడి అంతం
, బుధవారం, 3 మార్చి 2021 (17:41 IST)
మనకు ఇష్టమైంది దొరుకుతుందనుకుంటే ఎవరైనా ఊరుకుంటారా.. ఎగిరి గంతేసి దాని దగ్గరకు వెళ్ళిపోతారు. రొమాన్స్ అంటే ఇష్టం లేని మగాడు సాధారణంగా ఉండడు. దీన్నే పావుగా వాడుకున్న ప్రత్యర్థులు ఒక యువకుడిని అతి దారుణంగా చంపేశారు. ఏకంగా తలను ఆలయం ముందు ఉంచి పారిపోయారు.
 
తమిళనాడు రాష్ట్రం తంజావూరు జిల్లా తంజావూరులోని పాళ్యెంలో నివాసముండే మణి రౌడీషీటర్. 19 యేళ్లకే ఇతను చేయని అరాచకమంటూ లేదు. స్థల వివాదాలు, గొడవలు, వివాహేతర సంబంధాలు ఇలా ఒకటేమిటి.. రౌడీషీటర్‌గా మారాడు మణి. ప్రత్యర్థులకు తలనొప్పై కూర్చున్నాడు.
 
మణిని ఎలాగైనా మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నారు. కామకోర్కెలు ఎక్కువ ఉన్న మణిని అలాగే మట్టుబెట్టాలని భావించారు ప్రత్యర్థులు. ఫుల్లుగా మద్యం సేవించి భోజనం కోసం బయటకు వచ్చిన మణిపై దాడి చేసి అతి దారుణంగా చంపేశారు. తల, మొండెంను వేరుచేశారు. 
 
తలను తీసుకెళ్ళి తంజావూరులోని ప్రముఖ ఆలయం ముందుంచారు. అయితే మణి ఫోన్ రికార్డ్‌ను పరిశీలించగా అందులో ఒక వాయిస్ రికార్డ్‌ను పోలీసులును గుర్తించారు. రా మణి.. మనం కలుద్దామంటూ రొమాన్స్‌గా మాట్లాడుతున్న మహిళ గొంతు విన్న పోలీసులు ఆ ముఠా ఎవరో పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుపతిలో బాలుడి కిడ్నాప్, ఆచూకీ చెప్పినవారికి పారితోషికం