Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ కుర్రాళ్లతో ఏంటి ఇకఇకలు పకపకలు, లింకు పెట్టుకున్నావా అంటూ...

Advertiesment
wife
, మంగళవారం, 2 ఫిబ్రవరి 2021 (22:36 IST)
ప్రేమను జయించాడు. కులాంతర వివాహం చేసుకున్నాడు. పెద్దలను ఎదిరించి వేరు కాపురం పెట్టాడు. ముగ్గురు పిల్లలు పుట్టారు. అయితే అతనిలో అప్పుడే అనుమానం పెనుభూతంగా మారింది. భార్య ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకుందని రగిలిపోయాడు. అతి దారుణంగా భార్యను చంపేశాడు.
 
చిత్తూరు జిల్లా కెవిబి పురం మండల కేంద్రంలోని బిసి కాలనీలో నివాసముండే సూరిబాబు, సుహాసినిలకు ముగ్గురు పిల్లలున్నారు. వీరికి పది సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. సూరిబాబు టైలర్. వీరికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవు. ప్రశాంతంగా సాగిపోయే కుటుంబం.
 
అయితే టైలరింగ్ కోసం వచ్చే కొంతమంది యువకులతో సుహాసిని క్లోజ్‌గా మాట్లాడటం చూశాడు సూరిబాబు. దీంతో భార్యపై ఇంతెత్తున లేచాడు, వాళ్లతో ఏంటి ఇకఇకలు పకపకలు. వారితో లింక్ పెట్టుకున్నావా అంటూ దారుణంగా మాట్లాడాడు. తను మామూలుగా మాట్లాడుతున్నానే తప్ప ఎవరితోను క్లోజ్‌గా లేనని సుహాసిని చెప్పింది. అస్సలు వారితో మాట్లాడవద్దు అంటూ షరతలు పెట్టాడు భర్త. ఇదంతా గత రెండు నెలల నుంచి సాగుతోంది.
 
అయితే ఈరోజు సాయంత్రం ఆ గొడవ కాస్త పెద్దదిగా మారి మాటామాటా పెరిగింది. ఆగ్రహం కట్టలు తెంచుకున్న సూరిబాబు భార్య సుహాసిని తలపై రోకలి బండతో మోది అతి దారుణంగా చంపేసి పరారయ్యాడు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కూతుళ్ళను చంపిన పద్మజ జైల్లో వింత శబ్ధాలు, భయాందోళనలో ఖైదీలు