Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రాణస్నేహితుడి భార్యను లొంగదీసుకున్నాడు, ఇద్దరూ కలిసి జంప్, ఫోన్లు స్విచాఫ్

ప్రాణస్నేహితుడి భార్యను లొంగదీసుకున్నాడు, ఇద్దరూ కలిసి జంప్, ఫోన్లు స్విచాఫ్
, సోమవారం, 1 ఫిబ్రవరి 2021 (22:15 IST)
వారిద్దరూ ప్రాణస్నేహితులు. చిన్నతనం నుంచే కలిసి ఉన్న వారు పెద్దయిన తరువాత కూడా ఒకరంటే ఒకరు విడిచి ఉండే వారు కాదు. అలాంటి స్నేహం వారిది. ఒక స్నేహితుడికి పెళ్ళి జరిగితే మరో స్నేహితుడికి పెళ్ళి కాలేదు. అయినా పెళ్ళయిన వ్యక్తి తన స్నేహితుడిని పరిచయం చేయించి ప్రాణస్నేహితుడిగా చెప్పాడు. అదే తాను చేసిన తప్పని ఆ తరువాత అతనికి అర్థమైంది.
 
మధ్యప్రదేశ్ ఇండోర్‌కు చెందిన అంకిత్ శుక్లా, యోగేష్‌లు స్నేహితులు. వీరిలో యోగేష్ బేగంబజార్‌లో వ్యాపారం చేస్తున్నారు. శుక్లాకు వివాహం జరిగింది కానీ ఇంకా ఆర్థికంగా సెటిల్ కాలేదు. దీంతో స్నేహితుడు యోగేష్ సూచలన మేరకు బిజినెస్ పార్టనర్స్ అవుదామనుకున్నాడు.
 
తన దగ్గర ఉన్న కొంత డబ్బును యోగేష్‌కు ఇచ్చి వ్యాపారాన్ని ప్రారంభించారు. యోగేష్ ఉన్న ప్రాంతంలోనే మరొక ఇంటిని అద్దెకు తీసుకున్నారు అంకిత్ శుక్లా..అతని భార్య. యోగేష్ ప్రాణ స్నేహితునితో పాటు బిజినెస్ పార్టనర్ కావడంతో అతని భార్యను పరిచయం చేశాడు.
 
స్నేహితుడు కదా అనుకుని పరిచయం చేసినందుకు చివరకు యోగేష్ నట్టేట ముంచాడు. శుక్లా భార్యను మెల్లగా ముగ్గులోకి లాగాడు. ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. స్నేహితుడికి ఎక్కడ తెలిసిపోతుందనుకుని ఆమెకు మెల్లగా మాయమాటలు చెప్పి పదిరోజుల క్రితం తీసుకెళ్ళిపోయాడు. భార్య కనిపించకపోవడంతో పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
 
దాంతో పాటు యోగేష్ కనిపించకపోవడంతో శుక్లాకు అనుమానం వచ్చింది. ఇద్దరి నెంబర్లు స్విచ్ ఆఫ్‌‌లో ఉండటంతో శుక్లా అనుమానమే నిజమైంది. అయితే పోలీసులు పారిపోయిన వారిద్దరినీ పట్టుకుని కౌన్సిలింగ్ ఇచ్చారు. అయితే శుక్లా భార్య మాత్రం తన ఇంటికి వెళ్లనని యోగేష్‌తోనే ఉంటానని చెబుతోందట. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అత్తను బెడ్ రూంలోకి లాగి బెడ్ పైన తోసిన అల్లుడు, ఆమె ప్రతిఘటించడంతో?