గంటలు గంటలు కుర్చీలకే అతుక్కుపోతే.. పైల్స్ తప్పదండోయ్

Webdunia
మంగళవారం, 9 జులై 2019 (15:25 IST)
గంటలు గంటలు కూర్చీలకే అతుక్కుపోతున్నారా.. అయితే పైల్స్‌ ముప్పు తప్పదని అంటూ హెచ్చరిస్తున్నారు.. వైద్యులు. అలా గంటల పాటు కూర్చుని పనిచేసే వారు ఆహారంలో పీచు అధికంగా వుండేలా చూసుకోవాలని.. వారు సూచిస్తున్నారు. తాజా కూరగాయలు, ఆకుకూరలను రోజూ డైట్‌లో చేర్చుకోవాలి. 
 
కదలకుండా ఒకే ప్రదేశంలో కూర్చుని చేసే ఉద్యోగాల్లో ఉన్నవారు ఎక్కువగా పైల్స్ సమస్య బారిన పడుతుంటారు. అలాగే ఆహార నియమాలు పాటించకపోవడం, తీవ్రమైన మానసిక ఒత్తిళ్లు వంటి వాటితో మొలలు వస్తుంటాయి. నీరు తక్కువగా తాగడం, ఫాస్ట్‌ ఫుడ్స్‌, వేపుళ్లు అతిగా తినడం వంటివి కూడా ఇందుకు కారణం అవుతాయి. 
 
పైల్స్ నివారణకు పీచు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. అంతేగాకుండా సోయా బీన్స్, బ్లాక్ బీన్స్, పీచు అధికంగా ఉండే కూరగాయలు, ధాన్యాలు వంటివి పైల్స్ రోగాన్ని నిరోధిస్తాయి. వీటితో పాటు మామిడి, నిమ్మ, బొప్పాయి మొదలైన పండ్ల రసాలు రోజూ తాగాలి. 
 
నిమ్మ, బెర్రీలు, ఆపిల్స్, టమోటాలు మొదలైనవి పైల్స్ నివారణకు ఉపయోగపడతాయి. అంజీర పండును రాత్రంతా నీటిలో నానపెట్టి ఉదయం పరగడుపును తింటే పైల్స్ వ్యాధి నయమైపోతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పెళ్లికి ముందు రౌడీషీటర్‌తో లేచిపోయిన లేడీ కానిస్టేబుల్

పరమశివుని దయతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి : సీఎం చంద్రబాబు

తప్పుడు అఫిడవిట్ సమర్పించి సర్పంచ్ పదవిని కోల్పోయిన మహిళ

Holiday: మహాశివరాత్రి మరుసటి రోజు సెలవు.. జాగరణ చేసి రెస్ట్ తీసుకోవచ్చు

రూ.30 లక్షల విలువ చేసే నగలు ధరించి పెళ్లికి వెళ్లిన మహిళ అదృశ్యం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

​అతి ప్రేమ భయానకం అంటూ వస్తోన్న 100 డేస్ లవ్ స్టోరీ

Garuda Ram: నాగబంధం నుంచి బైరాగి గా గరుడ రామ్‌ లుక్

ఒక్క డైలాగ్ విన్న తరువాతే బ్యాండ్ మేళం చేయాలని ఫిక్స్ అయ్యా : కోన వెంకట్

సంగీత్ శోభన్.. రాకాస ఓవర్సీస్‌లో 350కి పైగా థియేటర్లలో విడుదల

గోదారి గట్టుపైన నుంచి సుమంత్ ప్రభాస్ బ్రేకప్ సెలబ్రేషన్

తర్వాతి కథనం
Show comments