Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ : ఇంగ్లండ్‌తో భారత్ అమీతుమీ...

Webdunia
బుధవారం, 4 మార్చి 2020 (17:17 IST)
ఐసీసీ మహిళల ట్వంటీ20 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా గురువారం ఆతిథ్య ఇంగ్లండ్ జట్టుతో భారత క్రికెట్ జట్టు తలపడనుంది. ఇప్పటివరకు లీగ్ దశలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచి టీ20 వరల్డ్‌కప్ సెమీఫైనల్‌కు దూసుకొచ్చిన భారత మహిళల జట్టు ఈ మ్యాచ్ అత్యంత కీలకంగా మారింది. 
 
గురువారం జరిగే తొలి సెమీఫైనల్లో పటిష్ట ఇంగ్లండ్ జట్టుతో హర్మన్ ప్రీత్‌ కౌర్‌‌ నేతృత్వంలోని భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. సిడ్నీ గ్రౌండ్‌లో ఉదయం 9.30 గంటలకు మొదలయ్యే ఈ మ్యాచ్‌లో టీమిండియా ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. భారత జట్టు అన్ని విభాగాల్లో బలంగా ఉంది. 
 
యువ ఓపెనర్ షెఫాలీ వర్మ భీకరమైన ఫామ్‌లో ఉండడం జట్టుకు ప్లస్ పాయింట్. అలాగే, జెమీమా రోడ్రిగ్స్‌ కూడా బాధ్యతాయుతంగా ఆడుతోంది. బౌలర్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది లేదు. స్పిన్నర్లు, పేసర్లు అద్భుతంగా రాణిస్తూ గ్రూప్‌ దశలో జట్టుకు విజయాలు కట్టబెట్టారు. 
 
సెమీస్‌లోనూ అదే జోరు కొనసాగిస్తే తొలిసారి ఫైనల్‌ చేరడం పెద్ద కష్టమేం కాకపోవచ్చు. అయితే, సీనియర్‌‌ ప్లేయర్ల స్మృతి మంధాన, హర్మన్‌, వేదా కృష్ణ, ఆల్‌రౌండర్‌‌ దీప్తి శర్మ ఫామ్‌ అందుకోవాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Revanth Reddy: ఒకే వేదికపై రేవంత్ రెడ్డి, తీన్మార్ మల్లన్న (video)

Bakrid 2025: దేశ వ్యాప్తంగా బక్రీద్‌ను జరుపుకుంటున్న ముస్లిం సోదరులు

Sonu Sood: తిరుమలలో చిరు వ్యాపారిని పలకరించిన సోనూ సూద్ (video)

న్యూజిలాండ్‌లో కరోనా విజృంభణ - భారత్‌లో 5 వేలు దాటిన కరోనా

కస్టమర్ల FD రూ. 4.5 కోట్లను స్టాక్ మార్కెట్లో పెట్టేసిన బ్యాంక్ అధికారిణి, గోవిందా

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan : ఎ.ఎం.రత్నం కు అన్నీ అడ్డంకులేనా? హరిహర వీరమల్లు ఆలస్యానికి కారణమదేనా?

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

తర్వాతి కథనం
Show comments