Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారత్ పర్యటనకు సౌతాఫ్రికా జట్టు ఎంపిక.. డుప్లెసిస్‌కు చోటు

భారత్ పర్యటనకు సౌతాఫ్రికా జట్టు ఎంపిక.. డుప్లెసిస్‌కు చోటు
, మంగళవారం, 3 మార్చి 2020 (13:46 IST)
సౌతాఫ్రికా క్రికెట్ జట్టు త్వరలో భారత్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో మూడ వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. ఇందుకోసం క్రికెట్ సౌతాఫ్రికా 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. 
 
ఈ సిరీస్‌లో మాజీ కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌‌కు చోటుకల్పించారు. అంటే ఈ సిరీస్ ద్వారా పునరాగమనం చేయనున్నాడు. అతనితో పాటు రాస్సీ వాన్‌ డెర్‌ డస్సెన్‌ కూడా ఇండియాతో జరిగే వన్డే సిరీస్‌కు ఎంపికయ్యారు. వీరిద్దరూ ఆస్ట్రేలియాతో సిరీస్‌కు ఎంపికవ్వలేదు. లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌ జార్జ్‌ లిండే.. ఇండియాతో జరిగే వన్డే సిరీస్‌తో వన్డేల్లో ఆరంగేట్రం చేయనున్నాడు. 
 
ఈ నెల 12వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ సిరీస్‌లో భాగంగా, తొలి మ్యాచ్‌ 12న ధర్మశాలలో జరగనుండగా.. రెండో మ్యాచ్‌ 15న లక్నోలో, మూడో మ్యాచ్‌ 18న కలకత్తాలో జరగనున్నది. కాగా, డుప్లెసి రాకతో దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌ ఆర్డర్‌ బలోపేతం కానుంది.
 
సౌతాఫ్రికా జట్టు వివరాలు.. క్వింటన్‌ డీ కాక్ ‌(కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), టెంబా బావుమా, రాస్సీ వాన్‌ డెర్‌ డస్సెన్‌, ఫాఫ్‌ డుప్లెసిస్‌, కైల్‌ వెర్రైన్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌, డేవిడ్‌ మిల్లర్‌, జోన్‌-జోన్‌ స్ముట్స్‌, ఫెలిక్వాయో, లుంగి ఎంగిడి, లుతో సిపమ్లా, బ్యూరాన్‌ హెండ్రిక్స్‌, ఆన్రిచ్‌ నార్ట్‌జే, జార్జ్‌ లిండే, కేశవ్‌ మహరాజ్‌. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అతిగా ఆలోచించి.. చేతులెత్తేశారు.. ఓటమిపై విరాట్ కోహ్లీ