2027 ప్రపంచ కప్‌కు దూరంగా ఆ ఇద్దరు స్టార్ క్రికెటర్లు : గవాస్కర్

ఠాగూర్
మంగళవారం, 13 మే 2025 (15:15 IST)
భారత స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. దీంతో 2027లో జరుగనున్న ఐసీసీ వన్డే ప్రపంచ కప్ టోర్నీలో ఆడుతారంటూ ప్రచారం సాగుతోంది. దీంతో క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ స్పందించారు. కోహ్లీ, రోహిత్ శర్మలిద్దరూ వచ్చే 2027లో జరిగే ప్రపంచ కప్ ఆడరని జోస్యం చెప్పారు. ఈ ఇద్దరు క్రికెటర్లకు ఇది ప్రాక్టికల్‌గా సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.  
 
రోహిత్, కోహ్లీ వన్డేల్లో అద్భుతంగా ఆడతారు. 2027 వరల్డ్ కప్ విషయానికి వస్తే, అప్పటికీ వీరిద్దరిలో ఇప్పటిలానే దూకుడుగా, నిలకడగా ఆడే సత్తా ఉంటుందా? అని జాతీయ సెలక్షన్ కమిటీ ఆలోచన చేస్తుంది. వారిద్దరూ ఆడగలరు అని అనుకుంటేనే వారు 2027 వరల్డ్ కప్‌లో ఆడుతారని, లేనిపక్షంలో వరల్డ్ కప్‌కు దూరమవుతారన్నారు. 
 
అయితే, తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రం మరోలా ఉంటుందన్నారు. నిజాయితీగా చెప్పాలి అంటే నా అంచనా ప్రకారం రోహిత్, విరాట్ కోహ్లీ 2027 వరల్డ్ కప్ ఆడలేరు. కానీ, ఎవరికి తెలుసు.. ఒకవేళ బాగా ఆడుతూ అప్పటికీ కూడా సెంచరీలు మీద సెంచరీలు చేస్తే మాత్రం వారిని ఆ భగవంతుడు కూడా టీమ్ నుంచి తొలగించలేరు" అని సునీల్ గవాస్కర్ అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పిల్లలకు విషం ఇచ్చాడు.. ఆపై ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు..

రేపు కర్నూలులో రూ. 13, 400 కోట్లకు పైగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయబోతున్నా: ప్రధాని మోడి

ఆస్తుల పంపకంలో జగన్‌కు షాకిచ్చిన అప్పీలేట్ ట్రైబ్యునల్

ISRO: 2040 నాటికి స్వదేశీ సిబ్బందితో చంద్రయాత్రకు రంగం సిద్ధం

చైనాను కట్టడి చేయాలంటే భారత్ సాయం కావాల్సిందే : అమెరికా

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bala Saraswati Devi : రావు బాలసరస్వతి గారు ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్ కళ్యాణ్

Priyadarshi: ఏమీ చేయలేకపోతోన్నప్పుడు నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు : ప్రియదర్శి

గోపి గాళ్ల గోవా ట్రిప్.. కాన్సెప్ట్ చిత్రాలకు సపోర్ట్ చేయాలి : సాయి రాజేష్

Sudheer Babu: జటాధార తో సుధీర్ బాబు డాన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తాడా...

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

తర్వాతి కథనం
Show comments