Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సునీల్ గవాస్కర్ క్లోజ్ ఫ్రెండ్, మాజీ కెప్టెన్ మిలింద్ రేగే కన్నుమూత

Advertiesment
Milind Rege

సెల్వి

, బుధవారం, 19 ఫిబ్రవరి 2025 (13:13 IST)
Milind Rege
దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ క్లోజ్ ఫ్రెండ్, ముంబై మాజీ కెప్టెన్ మిలింద్ రేగే (76) కన్నుమూశారు. గుండె పోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల పలువురు క్రికెట్ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
 
మిలింద్, తన క్రికెట్ కెరీర్‌లో ఆఫ్ స్పిన్నర్‌గా రాణించారు. 70టీస్‌ల్లో ముంబై తరఫున 52 ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచులు ఆడిన ఆయన 126 వికెట్లు తీశారు. క్రికెట్‌లో రిటైర్ అయ్యాక మిలింద్ సెలక్టర్‌గా, మెంటార్‌గానూ సేవలు అందించారు. 
 
ముఖ్యంగా ముంబై క్రికెట్ అసోసియేషన్‌లో ఎన్నో సేవలు అందించారు. మేనేజింగ్ కమిటీ మెంబర్, సెలక్టర్, కామెంటేటర్, ఆ తర్వాత అడ్వైజర్‌గానూ నియమితులయ్యారు. 
 
మిలింద్ రేగే మృతి పట్ల పలువురు క్రికెట్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. నాగ్‌పూర్ వేదికగా ముంబై- విదర్భ రంజీ సెమీ పైనల్ మ్యాచ్‌లో ఆటగాళ్లంతా మిలింద్ మృతికి సంతాపం తెలిపారు. బ్లాక్ ఆర్మ్ బ్యాండ్స్ కట్టుకుని, కాసేపు మౌనం పాటిస్తూ నివాళులు అర్పించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Mohammed Siraj : ఆశా భోంస్లే మనవరాలితో బౌలర్ మహ్మద్ సిరాజ్ డుయెట్ సాంగ్.. వీడియో వైరల్