Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంగ్లాండ్‌కు గట్టి షాక్.. గాయంతో మార్క్ వుడ్ దూరం..

Webdunia
సోమవారం, 23 ఆగస్టు 2021 (19:05 IST)
భారత్‌తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్ ఓడిన ఇంగ్లాండ్.. మూడో టెస్టులో విజయం సాధించి సిరీస్‌ను సమయం చేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే ఆ జట్టుకు షాక్ తగిలింది. భుజం గాయంతో ఆ జట్టు స్టార్‌ పేసర్ మార్క్ వుడ్ హెడింగ్లీ మూడో టెస్ట్‌కు దూరమయ్యాడు. 
 
రెండో టెస్టు నాలుగో రోజు ఆటలోనే గాయపడిన అతను పూర్తి ఫిట్‌నెస్ సాధించలేకపోవడంతోమూడో టెస్ట్‌కు దూరంగా ఉంటాడని ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు ప్రకటించింది. అయితే 31 ఏండ్ల మార్క్‌ వుడ్‌ జట్టుతోనే ఉంటాడని, వైద్యుల పర్యవేక్షణలో కోలుకోవడంపై దృష్టిసారిస్తాడని తెలిపింది.
 
మూడో టెస్ట్ అనంతరం అతనికి మరోసారి ఫిట్‌నెస్‌ పరీక్ష నిర్వహిస్తామని అప్పటికీ కోలుకోలేకపోతే సిరీస్‌ నుంచి తప్పిస్తామని ఈసీబీ పేర్కొంది. భారత్ ఇంగ్లాండ్ ల మధ్య బుధవారం నుంచి మూడో టెస్ట్‌ ప్రారంభం కానుంది. 
 
ఇప్పటికే గాయాలతో బ్రాడ్, వోక్స్, అర్చర్ సేవలను కోల్పోయిన ఇంగ్లాండ్ జట్టుకు ఇది పెద్ద షాకే. అయితే గాయం కారణంగా దూరమైన వుడ్ స్తానంలో సకిబ్ మహ్మద్ టెస్టుల్లో అరంగ్రేటం చేసే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేసీఆర్‌కు పెరిగిన షుగర్ లెవెల్స్... యశోద ఆస్పత్రిలో అడ్మిట్

ఇద్దరు కొడుకులతో మంగళగిరి నివాసానికి వచ్చిన పవన్ కళ్యాణ్

గిరిజనులకు మామిడి పండ్లను బహుమతిగా పంపించిన పవన్ కళ్యాణ్

పుదుచ్చేరిలో వడ్డీ వ్యాపారుల వేధింపులతో యువకుడి ఆత్మహత్య

Husband: మహిళా కౌన్సిలర్‌ను నడిరోడ్డుపైనే నరికేసిన భర్త.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హరిహర వీరమల్లు దెబ్బకు యూట్యూబ్ షేక్... (వీడియో)

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

తర్వాతి కథనం
Show comments