Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీపై కరోనా పంజా : ఆస్పత్రి పడకలన్నీ ఫుల్.. ఫుల్

Webdunia
శుక్రవారం, 16 ఏప్రియల్ 2021 (08:35 IST)
దేశ రాజధాని ఢిల్లీపై కరోనా పంజా విసిరింది. ఒక్కసారిగా వేలాది మంది ఈ వైరస్ కోరల్లో చిక్కుకున్నారు. దీంతో పెద్ద ఎత్తున జనం హాస్పిటళ్లకు తరలివస్తున్నారు. ఈ క్రమంలో మౌలిక సదుపాయాల కొరత సమస్య ఉత్పన్నమైంది. 
 
క్రమంగా రోగుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ.. మరో వైపు ఆక్సిజన్‌ బెడ్ల కొరత ఏర్పడుతున్నది. దీంతో చేసేది లేక వైద్యులు ఒకే బెడ్‌పై ఇద్దరిని ఉంచి ఆక్సిజన్‌ అందిస్తున్నారు. 1,500 పడకలతో దేశంలోనే అతిపెద్ద కొవిడ్‌ సౌకర్యాల్లో ఒకటైన లోక్‌ నాయక్‌ జై ప్రకాశ్‌ నారాయణ్‌ (ఎల్‌ఎన్‌జేపీ)కి రోగులు భారీగా క్యూకడుతున్నారు.
 
కరోనా వైరస్ బారినపడినవారంతా అంబులెన్సులు, బస్సులు, ఆటోల్లో కూడా తరలివచ్చారు. కొత్తగా జన్మించిన శిశువుతో సహా వృద్ధుల వరకు వచ్చారు. అయితే హాస్పిటల్‌పై అధిక భారం ఉందని, ఇప్పటికే పూర్తి సామర్థ్యంతో పని చేస్తున్నట్లు దవాఖాన డైరెక్టర్‌ సురేశ్‌కుమార్‌ తెలిపారు. 
 
హాస్పిటల్‌లో ఉన్న పడకలు సరిపోవడం లేదని, గురువారం లోక్‌ నాయక్‌ హాస్పిటల్‌కు 158 కేసులు వచ్చాయని, దాదాపు అన్ని తీవ్రమైనవేనని పేర్కొన్నారు. కరోనా కొత్త వేరియంట్లు భారాన్ని పెంచుతున్నాయని, ప్రజలు మార్గదర్శకాలను పాటించడం లేదని, అజాగ్రత్తగా ఉన్నారన్నారు.
 
ఇదిలావుంటే, ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో జరుగుతున్న కుంభమేళాలో ఐదు రోజుల్లో 1,701 మందికి కరోనా సోకింది. ఇంకా చాలా మంది రిపోర్టులు రావాల్సి ఉన్నదని, అవి వస్తే బాధితుల సంఖ్య 2,000లకు చేరుకునే అవకాశముందని అధికారులు తెలిపారు. 
 
కుంభమేళాలో పాల్గొన్న లక్షలాది మంది భక్తులు కరోనా మార్గదర్శకాలను పాటించకుండా పవిత్ర స్నానాలు చేయడం వల్ల కేసుల సంఖ్య పెరిగిందని చెప్పారు. కాగా మధ్యప్రదేశ్‌లోని మహా నిర్వాని అకారా సంస్థ అధిపతి స్వామి కపిల్‌ దేవ్‌ కరోనాతో మరణించారు.
 
కుంభమేళాలో పాల్గొనడానికి వచ్చిన ఆయనకు ఇటీవల పరీక్షలు నిర్వహించడంతో కరోనా బయటపడింది. దీంతో దవాఖానలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఆర్ఎక్స్-100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు పితృవియోగం

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments