ఒక్కడోసు కూడా తీసుకోనివారికి అధిక ముప్పు... వినయ్ కుమార్

Webdunia
సోమవారం, 6 డిశెంబరు 2021 (11:38 IST)
ఒమిక్రాన్ కరోనా వేరియంట్‌పై ప్రపంచ దేశాలు అప్రమత్త చర్యలు చేపట్టాయి. కోవిడ్‌లో కొత్త రకం అయిన ఒమిక్రాన్‌కు సంబంధించి పలు అనుమానాలున్నాయి. తాజాగా ఒమిక్రాన్ అయినా మరొకటైనా టీకా ఒక్కడోసు కూడా తీసుకోనివారికి అధిక ముప్పు వుంటుందని.. సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) డైరక్టర్ డాక్టర్ వినయ్‌కుమార్ నందకూరి స్పష్టం చేశారు. 
 
పెద్దల్లో ముఖ్యంగా ఇతరత్రా వ్యాధులతో బాధపడుతున్న వారికి ఈ ముప్పు పొంచి వుందన్నారు. ఇప్పటికే కోవిడ్ బారిన పడి రెండు టీకాలు వేయించుకున్నవారికి ఆ ప్రమాదం తక్కువ అంటూ చెప్పుకొచ్చారు. ఒక డోసు టీకా తీసుకున్నవారితో పోలిస్తే రెండు డోసులు తీసుకున్నవారికి రక్షణ ఎక్కువని వినయ్ కుమార్ చెప్పుకొచ్చారు.  
 
దేశంలో చాలామంది రెండో డోసు వేయించుకోవాల్సి వుంది. ఇక తొలి ప్రాధాన్యం కరోనా వ్యాక్సిన్‌కు ఇవ్వాలి. ఆ తర్వాత 12 నుంచి 18 ఏళ్ల లోపు పిల్లలకు వ్యాక్సిన్ ఇవ్వాల్సి వుంటుంది. బూస్టర్ డోసుపై ప్రభుత్వం ప్రాధాన్యాలను బట్టి నిర్ణయం తీసుకుంటుందని.. మిగిలిన దేశాలతో పోలిస్తే మనవి భిన్న పరిస్థితులు అంటూ వినయ్ వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

ఘంటసాల ది గ్రేట్ మూవీ మరో శంకరాభరణం అవుతుందన్న ప్రముఖులు

నేను నమ్మితే షూటింగ్ కు కూడా ఎప్పుడో గానీ వెళ్లను : నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్

Akhil Akkineni : ప్రశాంత్ నీల్ తో అఖిల్ అక్కినేని చిత్రం ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments