Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిశ ఎన్‌కౌంటర్‌కు రెండేళ్లు - సీన్ రీకన్‌స్ట్రక్షన్ పేరుతో ఎన్‌కౌంటర్

Webdunia
సోమవారం, 6 డిశెంబరు 2021 (11:25 IST)
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన దిశ ఎన్‌కౌంటర్ జరిగి డిసెంబరు ఆరో తేదీకి రెండు సంవత్సరాలు. గత యేడాది నవంబరు 28వ తేదీ రాత్రి ఓ వెటర్నరీ వైద్యురాలిని కిడ్నాప్ చేసి అత్యాచారం, ఆపై హత్య చేశారు. ఆ తర్వాత శవాన్ని పెట్రోల్ పోసి కాల్చేశారు. ఈ కేసులో నలుగురు కామాంధులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. దీనికి దిశా ఎన్‌కౌంటర్‌గా పేరు పెట్టారు. 
 
ఈ కేసు విచారణలో భాగంగా సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం ఘటనా స్థలానికి నిందితులను సైబరాబాద్ పోలీసులు తీసుకెళ్లారు. కానీ, వారు పోలీసులపై దాడి చేసి పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరుపగా, ఆ నలుగురు నిందితులు ప్రాణాలు కోల్పోయారు. ఇది దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. ఆ సమయంలో సైబరాబాద్ పోలీస్ కమిషనరుగా సజ్జనార్ ఉన్నారు. ఈ ఎన్‌‍కౌంటరుతో ఆయన పేరు మార్మోగిపోయింది. 
 
ఇదిలావుంటే, దిశ ఎన్‌కౌంటర్‌పై నిందితుల కుటుంబాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. దీంతో సుప్రీంకోర్టు సిర్పూర్కర్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ గత రెండేళ్లుగా విచారణ జరుపుతోంది. ఇప్పటికే అనేక మంది వద్ద ఈ కమిషన్ విచారణ జరిపింది. అలాగే, ఆదివారం ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని కూడా ఈ కమిషన్ సభ్యులు సందర్శించారు. 

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments