Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కరోనా కేసులకు మూలం మర్కజ్... 2027కి పెరిగిన సంఖ్య

Webdunia
గురువారం, 2 ఏప్రియల్ 2020 (08:42 IST)
ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ సమ్మేళనం దెబ్బకు దేశంలో కరోనా కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. దేశంలోని పలు ప్రాంతాలకు కరోనా వ్యాపించడానికి ప్రధాన కారణం ఈ మర్కజ్ సమ్మేళనమేనని తేలిపోయింది. దీంతో ఆపరేషన్ నిజాముద్దీన్ పేరుతో కేంద్రం కఠిన చర్యలు తీసుకుంది. మర్కజ్ భవన్‌లో ఉన్న విదేశీ, స్వదేశీ ముస్లిం మతపెద్దలందరినీ క్వారంటైన్లకు తరలించారు. పైగా, ఢిల్లీ నిజాముద్దీన్ నుంచే దేశంలోని పలు ప్రాంతాలకు కరోనా వ్యాప్తి పెరిగింది. 
 
బుధవారం ఆయా రాష్ట్రాల్లో కొత్తగా వెలుగు చూసిన పాజిటివ్‌ కేసుల్లో ఎక్కువ మంది మర్కజ్‌ ప్రార్థనల్లో పాల్గొని వచ్చిన వారుగా తేలింది. ఇప్పటివరకు 6000 మందిని గుర్తించారు. మరో 2 వేల మంది కోసం గాలిస్తున్నారు. భారత్‌లో శుక్రవారం ఉదయం వరకు 2027 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 62 మంది ప్రాణాలు కోల్పోయారు. 169 మంది ఈ వైరస్‌ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.
 
ఈ కరోనా కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 335, కేరళలో 265 కేసులు నమోదు అయ్యాయి. తమిళనాడులో 234, ఢిల్లీలో 152, రాజస్థాన్‌లో 120, ఉత్తరప్రదేశ్‌లో 177, ఆంధ్రప్రదేశ్‌లో 111, కర్ణాటకలో 110, తెలంగాణలో 97, గుజరాత్‌లో 87, మధ్యప్రదేశ్‌లో 86, జమ్మూకాశ్మీర్‌లో 62, పంజాబ్‌లో 46, హర్యానాలో 43, పశ్చిమ బెంగాల్‌లో 37, బీహార్‌లో 24, చండీఘర్‌లో 17 కేసులు నమోదయ్యాయి. 
 
అలాగే, అసోంలో 13, లడఖ్‌లో 13, అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో 10, ఛత్తీస్‌గఢ్‌లో 9, ఉత్తరాఖండ్‌లో 7, గోవాలో 5, ఒడిశాలో 5, హిమాచల్‌ప్రదేశ్‌లో 3, పుదుచ్చేరిలో 3, జార్ఖండ్‌, మణిపూర్‌, మిజోరంలో ఒక్కొక్క కేసు చొప్పున నమోదు అయ్యాయి. హర్యానా ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఊపిరిపీల్చుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments