Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనా వైరస్, ఇప్పుడు జపించాల్సింది మధుసూధనా, విష్ణుదేవ, ఎందుకని?

కరోనా వైరస్, ఇప్పుడు జపించాల్సింది మధుసూధనా, విష్ణుదేవ, ఎందుకని?
, బుధవారం, 1 ఏప్రియల్ 2020 (23:28 IST)
కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఐతే ఈ వైరస్‌ను నిరోధించేందుకు అన్ని జాగ్రత్తలతో పాటు మనలో పాజిటివ్ ఎనర్జీని కూడా చేకూరేట్లు చూసుకోవాలి. దైవారాధన వల్ల కలిగే మహత్తర శక్తి లేదంటారు. అందుకే ఈ క్రింది మంత్రాలను ఆయా సమయాల్లో జపించాలి.
 
ఔషధ సమయంలో - విష్ణుదేవ,
భోజన సమయంలో - జనార్దన,
నిద్రించేటపుడు - పద్మనాభ,
పెళ్లిలో - ప్రజాపతి,
యుద్ధంలో - చక్రధర,
ప్రవాసంలో - త్రివిక్రమ,
తన త్యాగంలో - నారాయణ,
స్నేహంలో - శ్రీధర,
దుస్స్వప్నంలో - గోవింద,
కష్టంలో - మధుసూదన,
అరణ్యంలో - నరసింహ,
అగ్నివేడిమిలో - జలశాయి,
జలమధ్యంలో - వరాహస్వామి,
పర్వతంలో - రఘునందన,
గమనంలో - వామన,
సర్వకాలాల్లో - మాధవ... అనే నామాలను స్మరించేవారికి ఎలాంటి కష్టం వచ్చినా తొలగిపోతుంది. ఈ నామాలను ఎల్లప్పుడు జపిస్తూ వుంటే వాటి శక్తి నిత్యం మన వెన్నంటే వుంటుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీరామ నవమి: రామ నామ స్మరణ చేసిన పరమేశ్వరుడు, ఏంటా మంత్రం?