Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండిగో విమానంలో పండంటి పాపకు జన్మనిచ్చిన మహిళ..!

Webdunia
బుధవారం, 17 మార్చి 2021 (13:44 IST)
Indigo
కర్ణాటకలోని బెంగళూరు నుంచి రాజస్థాన్‌లోని జైపూర్ వెళ్లిన ఇండిగో విమానంలో బుధవారం ప్రయాణించిన ఓ గర్భిణి విమానంలోనే పాపకు జన్మనిచ్చారు. విమానంలో ప్రయాణిస్తున్న ఒక డాక్టర్, విమాన సిబ్బంది సహాయంతో కాన్పు చేశారు.
 
జైపూర్ విమానాశ్రయానికి సమాచారం అందించడంతో విమానం అక్కడికి చేరేసరికి తల్లీబిడ్డలకు పూర్తి వైద్య సహాయం అందించేందుకు వీలుగా అంబులెన్స్, డాక్టర్‌ని సిద్ధంగా ఉంచారు. ప్రస్తుతం తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని ఇండిగో విమానయాన సంస్థను ఉటంకిస్తూ ఏఎన్ఐ వార్తాసంస్థ తెలిపింది. అలాగే విమానంలో జన్మించిన తల్లీబిడ్డకు ఎయిర్ పోర్ట్ చేరగానే ఇండిగో సిబ్బంది స్వాగతం పలికారు.
 
కాగా... గత ఏడాది అక్టోబర్‌లో ఇలాంటి సంఘటన చోటుచేసుకుంది. ఢిల్లీ నుంచి బెంగళూరుకు ప్రయాణిస్తున్న ఇండిగో విమానంలో ఒక మహిళా ప్రయాణీకురాలు విమానంలో పండంటి పసికందుకు జన్మనిచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments