Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏం చేసేదీ నా తల్లిదండ్రుల మాట కాదనలేకపోయా, ఐతే చచ్చిపోదాం రమ్మంటూ...

Webdunia
బుధవారం, 17 మార్చి 2021 (13:37 IST)
నిజామాబాద్ జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ప్రియురాలు ప్రాణాలు కోల్పోగా, ప్రియుడు ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్నాడు.
 
వివరాల్లోకి వెళితే... సిరికొండ మండలం పందిమడుగు గ్రామానికి చెందిన వందన అనే యువతి చింతల్ తండాకు చెందిన సుభాష్‌తో ప్రేమలో పడింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఐతే సుభాష్ తల్లిదండ్రులు వేరే అమ్మాయితో వివాహం నిశ్చయించారు. పెద్దల మాట కాదనలేక ఆమెను పెళ్లాడాడు. పెళ్లయి 2 నెలలయింది. ప్రేమికురాలు బుధవారం ఉదయం సుభాష్ కి ఫోన్ చేసి పిలిచింది.
 
ఇద్దరూ శివారులో వున్న పొలంలోకి వెళ్లారు. అక్కడికెళ్లాక... తనను కాదని వేరే యువతిని ఎలా పెళ్లాడావంటూ ఆమె నిలదీసింది. ఈక్రమంలో ఇద్దరూ కలిసి ఆత్మహత్య చేసుకుని చనిపోదామని నిర్ణయించుకుని పురుగులు మందు తాగారు. పొలంలో నురగలు కక్కుతు వున్న జంటను చూసి స్థానికులు ఫిర్యాదు చేయడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. 
 
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వందన చనిపోయింది. సుభాష్ కూడా ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్నట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments