సునందా పుష్కర్ మృతి కేసు : శశిథరూర్‌కు బెయిల్

సునందా పుష్కర్ మృతి కేసులో ఆమె భర్త, కేంద్ర మాజీ మంత్రి, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌కు బెయిల్ మంజూరైంది. ఆయన శనివారం ఢిల్లీ పాటియాలా కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసు విచారణ కోసం ఆయన వచ్చారు.

Webdunia
శనివారం, 7 జులై 2018 (11:41 IST)
సునందా పుష్కర్ మృతి కేసులో ఆమె భర్త, కేంద్ర మాజీ మంత్రి, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌కు బెయిల్ మంజూరైంది. ఆయన శనివారం ఢిల్లీ పాటియాలా కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసు విచారణ కోసం ఆయన వచ్చారు. ఆ తర్వాత ఆయన రెగ్యులర్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే, ఆయనకు కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది.
 
శశిథరూర్ శనివారం సునందా పుష్కర్ మృతి కేసు విచారణలో భాగంగా కోర్టు ముందు ప్రత్యక్షంగా హాజరయ్యారు. సమన్లకు స్పందిస్తూ శశి కోర్టుకు హాజరైనట్లు అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ సమర్ విశాల్ తెలిపారు. సెషన్స్ కోర్టు ఆయనకు ముందే బెయిల్ మంజూరు చేసిందని, బెయిల్ బాండ్లను స్వీకరించినట్లు మెజిస్ట్రేట్ చెప్పారు. ఈ కేసులో తదుపరి విచారణ జూలై 26కు వాయిదా పడింది. భార్య సునందా పుష్కర్ మృతి కేసులో ఢిల్లీ పోలీసులు శశిథరూర్‌పై చార్జ్‌షీట్ దాఖలు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments