Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో 40 అనుమానిత ఒమిక్రాన్ కేసులు - 10 మంది ముంబైకర్లకు పాజిటివ్

Webdunia
శుక్రవారం, 3 డిశెంబరు 2021 (14:41 IST)
దేశంలో ఒమిక్రాన్ వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తుంది. ఇప్పటికే బెంగుళూరులో ఒక వైద్యుడితో పాటు ఇద్దరికి ఈ వైరస్ సోకింది. దీంతో దేశంలోకి ఒమిక్రాన్ వేరియంట్ ప్రవేశించినట్టు నిర్ధారణ అయింది. ఇపుడు దేశ వ్యాప్తంగా 40కిపైగా అనుమానితి ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు ఉన్నట్టు సమాచారం. ఈ కేసుల్లో మహారాష్ట్రలో 28, ఢిల్లీలో 12 చొప్పున ఉన్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వర్గాల సమాచారం. 
 
మహారాష్ట్రలో అనుమానిస్తున్న 28 ఒమిక్రాన్ కేసుల్లో ఏకంగా 10 మంది రోగులు రాజధాని ముంబైకు చెందిన వారే కావడం గమనార్హం. అలాగే, ఢిల్లీలో 12 అనుమానిత కేసులను గుర్తించారు. వీరందరినీ లోక్ నాయక్, జై ప్రకాష్ నారాయణ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గురువారం ఎనిమిది అనుమానితులను ఆస్పత్రిలో చేర్చగా శుక్రవారం మరో నలుగురిని తరలించారు.
 
ఇదిలావుంటే, గురువారం ఒక్క రోజే వివిధ దేశాల నుంచి 861 మంది ప్రయాణికులు దేశంలోకి వచ్చారు. వీరిందరికీ ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయగా, ఇందులో 28 మందికి ఒమిక్రాన్ వైరస్ సోకినట్టు అనుమానిస్తున్నారు. ఈ 28 మందిలో 25 మంది అంతర్జాతీయ ప్రయాణికులు కాగా, మరో ముగ్గురు వారి కాంటాక్ట్‌లని వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments