సోషల్ మీడియాలో నారా లోకేష్‌పై సెటైర్లు.. ఎందుకని?

ఏపీ మంత్రి నారా లోకేష్ మళ్లీ వార్తల్లో నిలిచారు. దివంగత ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయికి సంతాప సందేశాన్ని కవిత్వంలో ప్రారంభించి.. చరిత్ర గురించి వివరిస్తూ చివరికి తన తండ్రి పాలన గురించి గొప్పలు చ

Webdunia
బుధవారం, 22 ఆగస్టు 2018 (11:02 IST)
ఏపీ మంత్రి నారా లోకేష్ మళ్లీ వార్తల్లో నిలిచారు. దివంగత ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయికి సంతాప సందేశాన్ని కవిత్వంలో ప్రారంభించి.. చరిత్ర గురించి వివరిస్తూ చివరికి తన తండ్రి పాలన గురించి గొప్పలు చెప్పుకోవడం పట్ల నెటిజన్లు సెటైర్లు విసురుతున్నారు. నారా లోకేష్ ట్వీట్ ప్రస్తుతం విపరీతంగా వైరల్‌ అవుతోంది. నారో లోకేష్‌కు రాజకీయాల పట్ల ఇంకా అవగాహన రాలేదని ఎద్దేవా చేస్తున్నారు. 
 
ఇంతకీ విషయం ఏమిటంటే.. వాజ్‌పేయ్‌ కన్నుమూత సందర్భంగా లోకేష్‌ విడుదల చేసిన సంతాప సందేశంపై సోషల్‌ మీడియాలో మూడు రోజులుగా సెటైర్లు పేలుతున్నాయి. సంతాప సందేశంలో వాజ్‌పేయ్‌ కంటే తన తండ్రి చంద్రబాబు నాయుడినే లోకేష్‌ ఎక్కువగా ప్రస్తావించడంపై నెటిజన్లు ఛలోక్తులు విసురుతున్నారు. 
 
గతంలో ప్రసంగంలో పొరపాట్లు చేసి నోరుజారి నారా లోకేష్ పరువు తీయించుకున్న సందర్భాలున్నాయి. అలాగే గతంలో అంబేద్కర్  జయంతి సభలో పాల్గొని వర్థంతి అంటూ తప్పుగా మాట్లాడడంతో సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. ఏపీ మంత్రి హోదాలు వుండి వర్థంతికి, జయంతికి తేడా తెలియక నారా లోకేష్ మాట్లాడటంపై జోకులు పేలిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishwak Sen.: విశ్వక్ సేన్.. ఫంకీ థియేటర్ డేట్ ఫిక్స్

Pre-Wedding Show Review: హాయిగా నవ్వుకునేలా ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో.. మూవీ రివ్యూ

కేజీఎఫ్ విలన్ హరీష్ రాయ్ ఇకలేరు

సింగర్ నుంచి మ్యూజిక్ డైరెక్టర్ గా మారా, ది గర్ల్ ఫ్రెండ్ స్ఫూర్తినిచ్చింది - హేషమ్ అబ్దుల్ వహాబ్

NtR: ప్రశాంత్ నీల్ చిత్రం షెడ్యూల్ కు సిద్ధం అవుతున్న ఎన్.టి.ఆర్.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments