Webdunia - Bharat's app for daily news and videos

Install App

Madanapalle వాళ్లకి పిచ్చి బాగా ముదిరింది, మేము సరిచేయలేదు, వైజాగ్ పంపాల్సిందే

Webdunia
శనివారం, 30 జనవరి 2021 (11:47 IST)
దేశవ్యాప్తంగా సంచలన సృష్టించిన మదనపల్లె జంట హత్యల కేసు నిందితులను డెల్యూషన్ వ్యాధి నుంచి బయటకు తీసుకురావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు వైద్యులు. 14 రోజుల రిమాండ్ తరువాత సబ్ జైలుకు నిందితులు పురుషోత్తం నాయుడు, పద్మజలను తరలించారు. 
 
అయితే రిమాండ్‌లో ఉన్న సమయంలో మదనపల్లె సబ్ జైలులో గట్టిగా అరుస్తూ శివా..శివా అంటూ వింత శబ్ధాలతో పద్మజ నిద్ర పోకుండా రాత్రింబవళ్ళు అరుస్తూనే ఉన్నట్లు సబ్ జైలు సిబ్బంది వైద్యుల దృష్టికి తీసుకెళ్ళారు. దీంతో తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు.
 
కానీ తిరుపతి రుయా ఆసుపత్రిలో కౌన్సిలింగ్ చేసిన తరువాత వైద్యులు తాము వీరికి వైద్యం చేయలేమని చేతులెత్తేశారు. అంతేకాదు ఆసుపత్రిలో వీరి జబ్బును నయం చేయడానికి కస్టోడియల్ కేర్ అవసరం. అది రుయా ఆసుపత్రిలో అందుబాటులో లేదు. వీరికి జబ్బు నయం కావాలంటే వైజాగ్ లోని మానసిక చికిత్స కేంద్రమే సహకరిస్తుందని వైద్యులు తేల్చి చెప్పారు.
 
దీంతో నిన్న రాత్రి తిరుపతిలోని రుయాలో ఉన్న ఇద్దరు నిందితులను తిరిగి మదనపల్లెకు తీసుకెళ్ళారు. సబ్ జైలులో రాత్రి ఉంచారు. ఈరోజు మెజిస్ట్రేట్ అనుమతి తీసుకున్న తరువాత వైజాగ్‌కు ఇద్దరు నిందితులను తరలించనున్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments