Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నా కుమార్తెలిద్దరూ శివపార్వతులు, నేను కాళికా దేవిని (Video)

నా కుమార్తెలిద్దరూ శివపార్వతులు, నేను కాళికా దేవిని (Video)
, గురువారం, 28 జనవరి 2021 (10:41 IST)
మదనపల్లి జంట హత్యల కేసులో నిందితురాలైన పద్మజ చెబుతున్న ఒక్కో విషయం విని పోలీసులు షాక్ తింటున్నారు. తన కుమార్తెలిద్దరూ శివపార్వతులనీ, తను కాళికా దేవినంటూ చెప్పుకుంటున్నారట. అంతేకాదు.. తను చెప్పే విషయాలను శివుడు.. అంటే తన పెద్దకుమార్తె వింటుందనీ, శివుడు చెప్పే మాటలను తను తు.చ తప్పకుండా పాటిస్తానని వెల్లడించిందట.
 
మరోవైపు ఆమెను ఆసుపత్రిలో పరీక్షించిన వైద్యులు ఆమె మానసిక స్థితి సరిగా లేదని తేల్చారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఈ కేసులో దోషులు తల్లిదండ్రులు. బిడ్డల్ని చంపేశామన్న పశ్చాత్తాపం ఏ మాత్రం వారిలో కనిపించలేదు. ముఖ్యంగా నిన్న సాయంత్రం మదనపల్లె సబ్ జైలుకు తరలించారు వీరిద్దరినీ.
 
14 రోజుల పాటు రిమాండ్‌కు పంపించారు. అయితే జైలులో ఏ మాత్రం బాధపడకుండా పద్మజ హాయిగా మెడిటేషన్ చేసుకుని కూర్చుని ఉందట. కేవలం గంట మాత్రమే ఆమె నిద్రపోయిందట. మిగతా సమయం మొత్తం నేను శివుడ్ని అంటూ చెప్పుకుందట.
 
నేను శివుడ్ని, నన్ను కరోనా ఏమీ చేయలేదు నాకు పరీక్ష చేస్తారా.. నేను ధ్యానంలో ఉన్నాను. అన్ని రోగాలు తొలగిపోతాయి. ఇలా ఏవేవో చెప్పుకుంటూ గట్టిగా అరుస్తూ సబ్ జైలులో కూర్చుందట పద్మజ. దీంతో జైలు సూపరింటెండెంట్ రామక్రిష్ణ నాయక్ ఉదయాన్నేభార్యాభర్తలిద్దరినీ మదనపల్లె ఆసుపత్రికి తీసుకెళ్ళారట.
 
ఆసుపత్రిలో వైద్యులు తిరుపతి రుయాకు రెఫర్ చేశారట. దీంతో మెజిస్ట్రేట్ ఆదేశాలతో తిరుపతి రుయాకు నిందితులిద్దరినీ తీసుకువస్తున్నారు. వారిద్దరికీ రుయాలో ట్రీట్మెంట్ ఇచ్చిన తరువాత తిరిగి మదనపల్లె ప్రభుత్వ సబ్ జైలుకు తరలిస్తారు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సెంచరీ కొట్టిన పెట్రోల్‌!