తెలుగు రాష్ట్రాల్లో భానుడు విశ్వరూపం-ట్రెండింగ్ అవుతున్న ఫోటో

Webdunia
శనివారం, 4 జూన్ 2022 (14:22 IST)
photo courtesy_Social media
తెలుగు రాష్ట్రాల్లో భానుడు విశ్వరూపం చూపిస్తున్నాడు. ఏపీ, తెలంగాణలో విపరీతమైన ఎండలు మండిపోతున్నాయి. ఎండ, వడగాలులు వీస్తున్నాయి. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో 45 డిగ్రీల సెల్సియస్‌కు మించి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 
 
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతపల్లి, మారేడుమిల్లి, రాజవొమ్మంగి, తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి, గోకవరం, కాకినాడ జిల్లాలోని జగ్గంపేట, పెద్దాపురం మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీస్తాయని వివరించింది. మరో 186 మండలాల్లో వడగాడ్పులు వీస్తున్నాయి. 
 
అలాగే ఖమ్మం కొత్తగూడెం 46 డిగ్రీలు, కరీంనగర్‌ ఆదిలాబాద్‌, మంచిర్యాలలో 44 డిగ్రీలు, నల్గొండ, వరంగల్‌ , నిజామాబాద్‌లో 43 డిగ్రీలు, హైదరాబాద్‌, సిద్ధపేట, మహబూబ్‌నగర్‌లో 42 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైంది.
 
ప్రజలు అవసరమైతేనే బయటికి రావాలని, ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు తరచుగా నీటిని తాగుతుండాలని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. ఉప్పు కలిపిన మజ్జిగ, గ్లూకోజు, ఓఆర్ఎస్ కలిపిన నీటిని తాగవచ్చని వివరించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nag Ashwin: రుత్విక్ కి రాజా ది రాజా జస్ట్ బిగినింగ్ మాత్రమే : నాగ్ అశ్విన్

Anil Ravipudi: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన శ్రీనివాస మంగపురం లోని మంగా మంగా సాంగ్

మరో గ్లోబల్ రికార్డ్ క్రియేట్ చేసిన విరోష్ జోడి.. కపుల్ యాడ్ కు 9.1 మిలియన్ లైక్స్

KJR: మన దేశానికి నేషనల్ గేమ్ అనేదే లేదని చెప్పే గుర్తింపు ట్రైలర్

భర్తతో విడిపోతున్న నటి మౌనీరాయ్.... స్పందించిన బాలీవుడ్ నటి

తర్వాతి కథనం
Show comments