Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్యాన్స్ కోసం భ్రమరాంభ థియేటర్‌లో "సర్కారువారి పాట" రిలీజ్

Webdunia
సోమవారం, 2 మే 2022 (11:42 IST)
ప్రిన్స్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న చిత్రం "సర్కారువారి పాట". ఈ చిత్రం కోసం మహేష్ ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. కరోనా కారణంగా వాయిదాపడుతూ వస్తున్న ఈ చిత్రం మే12వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. అయితే, విడుదల తేదీ సమీపిస్తుండంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచారు. 
 
ఇందులోభాగంగా, ఈ చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు సిద్ధమైంది. మే 2వ తేదీ సాయంత్రం 4.05 గంటలకు ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ చేశారు. అయితే, తన అభిమానుల కోసం అంతకుముందే హైదరాబాద్ భ్రమరాంభ థియేటర్‌లో మధ్యాహ్నం 3 గంటలకు ఈ చిత్రం మాసివ్ మాస్ ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నట్టు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. 
 
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి పరశురాం దర్శకుడు. ఈయన "గీతగోవిందం" వంటి సక్సెస్ సినిమా తర్వాత దర్శకత్వం వచ్చిన చిత్రం కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఎస్.థమన్ సంగీత దర్శకుడు. 

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments