లారెన్స్ ట్రస్ట్‌లోని పిల్లలకు కరోనా, వాళ్లిప్పుడు ఎలా ఉన్నారో?

Webdunia
శనివారం, 6 జూన్ 2020 (16:23 IST)
ప్ర‌ముఖ‌ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు అయిన రాఘవ లారెన్స్‌కు సంబంధించిన ట్రస్ట్‌కు చెందిన చిన్నారులందరూ కరోనా వైరస్‌ నుంచి కోలుకున్నారని రాఘవ లారెన్స్‌ తెలిపారు. లారెన్స్‌ నిర్వహిస్తున్న అనాధాశ్రమంలోని 18 మంది చిన్నారులకు, ముగ్గురు సిబ్బందికి కొవిడ్‌-19 ఉన్నట్లు వైద్యులు ఇటీవల నిర్ధారించారు.
 
ఇప్పుడు వారంతా కోలుకోవడంతో లారెన్స్‌ సంతోషం వ్యక్తం చేశారు. ‘నా అభిమానులు, స్నేహితులకు నమస్కారం. ఓ మంచి విషయాన్ని మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. నా ట్రస్ట్‌లో ఉంటున్న కొంతమంది చిన్నారులు ఇటీవల కరోనా వైరస్‌ బారిన పడిన విషయం తెలిసిందే. కొవిడ్‌-19 నుంచి కోలుకోవడంతో తాజాగా వాళ్లని డిశ్చార్జ్‌ చేశారు.
 
ఈ సందర్భంగా ఎంతో సేవ చేసిన ఎస్పీ వేలుమణిగారికి, మంత్రివర్యులు జి. ప్రకాశ్‌గారికి, అలాగే డాక్టర్లు, నర్సులు అందరికీ కృతజ్ఞతలు. నా సేవే నా పిల్లలని కాపాడిందని భావిస్తున్నాను. నా పిల్లల కోసం ప్రార్థనలు చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సేవే దైవం..`అని అన్నారు రాఘవ లారెన్స్‌.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర రెడ్డి పెద్ద మనసు, పెంచలయ్య కుటుంబానికి రూ. 10 లక్షలు (video)

యమలోకానికి 4 రోజులు శెలవు పెట్టి హైదరాబాద్ రోడ్లపై తిరుగుతున్న యమధర్మరాజు (video)

భర్త లేని స్త్రీ మరొకడితో హాయిగా వుండకూడదా?

దొంగలు కొట్టేస్తారని 25 తులాల బంగారాన్ని పాత దిండులో పెట్టింది, దాన్ని కాస్తా చెత్తలో పడేసారు...

కాస్త అలసటగా వుంది, బెడ్ పైన పడుకున్న ఎల్బీ నగర్ ఎస్సై, తెల్లారి నిద్ర లేపితే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments