Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పిల్లలు ఎత్తు పెరగాలంటే..? మటన్, చికెన్‌తో పాటు..?

పిల్లలు ఎత్తు పెరగాలంటే..? మటన్, చికెన్‌తో పాటు..?
, శుక్రవారం, 29 మే 2020 (18:02 IST)
పిల్లలు ఎత్తు పెరగాలంటే.. ప్రోటీన్లు, క్యాల్షియం చాలా అవసరం. పిల్లలు సరైన మోతాదులో చికెన్, మటన్ వంటివి తీసుకుంటే కండరాల పెరుగుదలకు బాగా ఉపకరిస్తాయి. రోజుకో గుడ్డును తప్పక తీసుకునేలా చేయాలి. ఇక క్యాల్షియం కోసం పాలు తప్పకుండా ఆహారంలో భాగం చేయాలి. పాలలో విటమిన్ డి, ప్రోటీన్లు పుష్కలంగా వుంటాయి కాబట్టి.. రోజూ మూడు గ్లాసుల పాలను పిల్లలకు ఇవ్వడం చేయాలి. తద్వారా పిల్లలు ఎత్తుగా పెరుగుతారు.
 
ఇంకా సోయా ఉత్పత్తులను డైట్‌లో చేర్చుకోవడం ద్వారానూ పిల్లలు ఎత్తుగా పెరుగుతారు. సోయా మిల్క్ కూడా రోజుకో కప్పు లేదా గ్లాసు పిల్లలకు అందించడం చేయాలి. కేవలం మాంసాహారమే కాకుండా ఆకుకూరలు రోజుకో కప్పు మోతాదులో పిల్లలకు ఇవ్వాలి. మాంసాహారం తీసుకోని రోజు.. పిల్లల ఆహారంలో ఆకుకూరలు వుండాలి. వీటిల్లో వుండే విటమిన్స్ ఎముకలను బలపరచి, కండరాలను పెరిగేలా చేస్తాయి. 
 
ముఖ్యంగా బచ్చలి కూరను పిల్లలకు శాండ్ విచ్ వంటి స్నాక్స్‌లో చేర్చి ఇవ్వడం చేస్తే ఇష్టపడి తింటారు. ఇందులోని ఐరన్, క్యాల్షియం, ఫైబర్ పిల్లల ఎదుగుదలకు తోడ్పడుతుంది. అలాగే కూరగాయలన్నింటినీ చేర్చి సూప్ ద్వారా పిల్లలకు అందించడం ద్వారా కూడా పిల్లలు ఎత్తు పెరుగుతారు. వీటిలో బెండకాయను అస్సలు మరిచిపోకూడదు. 
 
బెండలో ప్రోటీన్స్, క్యాల్షియం, విటమిన్ ఎ, బి, డిలు వున్నాయి. ఫైబర్, పిండి పదార్థాలు, ఖనిజాలు కూడా వీటిలో పుష్కలంగా వున్న కారణంగా వారానికి మూడు సార్లు పిల్లల డైట్‌లో బెండకాయను చేర్చాలని న్యూట్రీషియన్లు సూచిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పొట్టలో కాస్త తేడాగా వుందా..? మజ్జిగలో కాసిన్ని మెంతుల్ని?