అతడిని చూస్తే పెళ్లి చేసుకోవాలనిపిస్తోంది... 2020లో కంగనా కన్ఫర్మ్?

Webdunia
గురువారం, 26 డిశెంబరు 2019 (19:34 IST)
విభిన్న కథాంశంతో సినిమాలు చేస్తూ బోల్డ్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా రనౌత్ ఇటీవల ఓ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో తనకు కాబోయే భర్త గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. 
 
ప్రస్తుతం కంగనా నితేశ్‌ తివారీ సతీమణి అశ్విని అయ్యర్‌ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పంగా’ సినిమాలో నటిస్తున్నారు. ఈ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలో ఆమె కబడ్డీ క్రీడాకారిణిగా కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన ‘పంగా’ ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ వచ్చిన విషయం తెలిసిందే.
 
ఈ సినిమా విశేషాలను పంచుకుంటూ... ‘అశ్వినీ చెప్తుంటే ఈ కథకు ఎమోషనల్‌గా కనెక్ట్‌ అయ్యాను. ఎలాంటి పరిస్థితులలోనైనా నా ధైర్యం నా కుటుంబమే. నిజ జీవిత కథాంశాలతో సినిమా తీయడంలో అశ్వినీకి మంచి అనుభవం ఉన్నందున ఆమెతో మరిన్ని చిత్రాలు చేయాలని ఆశిస్తున్నాను’ అని తెలిపారు. 
 
ఇక వివాహం గురించి అడగగా వివాహబంధంపై నాకు అంత మంచి అభిప్రాయం లేదు, అయితే అశ్వినీ అయ్యర్‌ తివారీ, ఆమె భర్త నితేశ్‌ తివారీలను చూస్తే నాకు కూడా త్వరలో పెళ్లి చేసుకోవాలని ఉంది. నాకు కాబోయే భర్త నాకంటే తెలివైనవాడు, టాలెంట్‌ ఉన్నవాడు అయ్యి ఉండాలనుకుంటున్నాను’ అని మనసులో మాట బయటపెట్టడంతో 2020లో వివాహం చేసుకోనున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Vizag: వైజాగ్‌లో 400 ఎకరాల్లో రిలయన్స్ డేటా సెంటర్

ఆ ఆటో డ్రైవర్ నిజాయితీకి నిలువుటద్దం... బ్యాగు నిండా డబ్బు దొరికినా... (వీడియో)

అమరావతిలో రూ.260 కోట్లతో శ్రీవారి ఆలయం.. శంకుస్థాపన చేసిన ఏపీ సీఎం చంద్రబాబు

సర్పంచ్ కుర్చీ కోసం ఆగమేఘాలపై వివాహం - తీరా చూస్తే ఆశలు గల్లంతయ్యాయి..

పదేపదే వేడినీళ్లు అడుగుతున్నాడు.. అతనో పిచ్చోడు.. వరుడిపై వధువు మండిపాటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments