Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పెళ్ళయిన వివాహితకు లవ్ ప్రపోజ్ చేసిన యువకుడు.. ఆ తరువాత?

పెళ్ళయిన వివాహితకు లవ్ ప్రపోజ్ చేసిన యువకుడు.. ఆ తరువాత?
, సోమవారం, 23 డిశెంబరు 2019 (15:34 IST)
వివాహమైన రెండు నెలలకే ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లెలో జరిగింది. ఒక యువకుడు ప్రేమ పేరుతో వివాహితను వేధించడంతో ఆమె మనస్థాపంతో తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది. మదనపల్లె గ్రామీణ మండలం కొత్తపల్లె పంచాయతీకి చెందిన రమ్య అనే యువతికి రెండునెలల క్రితం సమీప బంధువుతో వివాహమైంది. 
 
వివాహమైన తరువాత రెండు నెలల వరకు వీరి జీవితం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా బాగానే సాగింది. అయితే ఆ వివాహిత ఉన్న ఇంటి పక్కనే మంజునాథ్ అనే యువకుడు ఉండేవాడు. అతను వివాహిత సెల్ నెంబర్‌ను తీసుకుని ఫోన్‌లో లవ్ ప్రపోజ్ చేశాడు. పక్కింటి కుర్రాడే కదా తెలుసుకుంటాడులే అని ఊరుకుంది వివాహిత.
 
అయితే ఇంటి దగ్గరకు వచ్చి లవ్ ప్రపోజ్ చేయడం.. నువ్వు లేకుంటే చచ్చిపోతానంటూ బెదిరించడం.. ఇలా చేయడంతో విషయం కాస్త వివాహిత భర్త, అత్తమామల దృష్టికి వెళ్ళింది. ఇందులో రమ్య తప్పుందని భావించిన అత్తమామలు ఆమెను గత మూడురోజుల నుంచి హింసించడం మొదలుపెట్టారు. దీంతో మానసిక క్షోభకు గురైన వివాహిత తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తన చావుకు గల కారణాలను లేఖలో రాసింది రమ్య. దీంతో పోలీసులు యువకుడితో పాటు వివాహిత అత్త, మామలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బిత్తర సత్తిలా తమ్మినేని.. అలా అంటే గుడ్డలూడదీసి కొడతారు : తెదేపా నేత కూన