Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాళ్లు కాదు బిస్కెట్లు వేయండి: కరిచే కుక్కలపై రష్మి గౌతమ్ టిప్స్

Webdunia
గురువారం, 26 డిశెంబరు 2019 (19:25 IST)
జబర్దస్త్ మరియు యూట్యూబ్ పుణ్యమా అని మంచి పాపులారిటీ సంపాదించింది రష్మీ గౌతమ్. అప్పుడప్పుడూ సినిమాలలో మెరుస్తున్న ఈ ముద్దుగుమ్మ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. సామాజిక సమస్యలు, విషయాలపై ముక్కుసూటిగా తన అభిప్రాయాలు చెప్తుండటం ఆమె నైజం. అంతేకాకుండా మూగజీవాలకు సంబంధించిన పోస్ట్‌లు కూడా పెడ్తూ ఉంటుంది. 
 
గతంలో ఒకసారి సృష్టిలోని ఈగలను కాపాడుకోవడం మన బాధ్యత అని, అందుకోసం ఓ స్పూన్‌‌లో కొంచెం పంచదార, లేదంటే తీపి పదార్థాలను ఉంచాలని సూచించింది. మరోసారి ఆవుల వధను వ్యతిరేకిస్తూ అందరినీ మెప్పించే సందేశమిచ్చింది. ఇప్పుడు కుక్కల గురించి పెట్టిన పోస్ట్ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.
 
మనం రోడ్డుపై వెళ్తున్నప్పుడు చాలా కుక్కలు కనిపిస్తుంటాయి. కొన్నిసార్లు అవి అరుస్తాయి, కరిచేందుకు కూడా వస్తాయి. అలాంటి కుక్కలపై రాళ్లు వేయడం బుద్ధితక్కువ పని అని, అలా కాకుండా వాటికి బిస్కెట్లు వేస్తే అవి ఎంతో విశ్వాసాన్ని చూపిస్తాయని, తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా మనల్ని కాపాడతాయని పేర్కొంది. ఇక రష్మీ కూడా బంబుల్ అనే కుక్కపిల్లని పెంచుకుంటోంది. దానితో దిగిన ఫోటోలను అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటుంది.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments