టీవీ చానెల్‌లో భాగస్వామికానున్న 'బాహుబలి' ప్రభాస్

Webdunia
మంగళవారం, 14 మే 2019 (13:19 IST)
టాలీవుడ్ మోస్ట్ బ్యాచిలర్ ప్రభాస్. "బాహుబలి" చిత్రం తర్వాత ఈ హీరో రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ప్రస్తుతం "సాహో" చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. మరోవైపు, ప్రభాస్ వ్యాపార రంగంలో కూడా రాణిస్తున్నాడు. 
 
ఇందులోభాగంగా, ఆయన సొంతంగా ఓ టీవీ చానెల్‌లో భాగస్వామికానున్నట్టు ఫిల్మ్ నగర్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్ర‌భాస్ స్నేహితులు వంశీ కృష్ణా రెడ్డి, ఉప్ప‌ల‌పాటి ప్ర‌మోద్‌లు కలిసి త్వరలో ఓ టీవీ చానెల్‌ను ప్రారంభించనున్నారు. ఇందులో ప్ర‌భాస్ కూడా భాగ‌స్వామి కానున్నారన్నది టాక్. అయితే, ఈ వార్తల్లో నిజం ఎంతో తెలియాల్సివుంది. 
 
ఏదేమైన మ‌న స్టార్స్ ఓ వైపు న‌ట‌న‌ని కొన‌సాగిస్తూనే మ‌రోవైపు బిజినెస్ రంగాలపై దృష్టి పెట్ట‌డం విశేషం. ఇటీవ‌లి కాలంలో మ‌హేష్ బాబు ఏఎమ్‌బీ అనే మ‌ల్టీ ప్లెక్స్‌తో బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిన విష‌యం విదిత‌మే. బ‌న్నీ కూడా త్వర‌లోనే ఓ మ‌ల్టీప్లెక్స్ నిర్మించ‌నున్నారనే వార్త హల్ చల్ చేస్తోంది. గతంలో చిరంజీవి, నాగార్జున కూడా మా టీవీలో భాగస్వాములుగా ఉన్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో ఆ ప్రభుత్వం వుంది.. మనం బుల్లెట్ రైలులా దూసుకెళ్తున్నాం: నారా లోకేష్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు.. సునీత కోసం ప్రచారంలో కేసీఆర్ పాల్గొంటారా?

Pepper Spray: తరగతి గదిలో పెప్పర్ స్ప్రే.. ఆస్పత్రిలో తొమ్మిది మంది విద్యార్థులు, టీచర్లు

విశాఖలో గూగుల్ ఆర్టిఫిషియల్ హబ్ : ప్రశంసల వర్షం కురిపించిన జేపీ

పిల్లలకు విషం ఇచ్చాడు.. ఆపై ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

తర్వాతి కథనం
Show comments