Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాపం వినాయక్, చిరు షాక్ ఇచ్చారా?

Webdunia
శనివారం, 10 అక్టోబరు 2020 (13:41 IST)
ఆది సినిమాతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చిన వినాయక్.. అనతి కాలంలోనే స్టార్ హీరోలను డైరెక్ట్ చేసి స్టార్ డైరెక్టర్ అయ్యారు. అయితే.. మెగాస్టార్ చిరంజీవితో ఖైదీ నెంబర్ 150 సినిమాని డైరెక్ట్ చేసి సంచలన విజయం సాధించారు. ఆ తర్వాత కెరీర్లో గ్యాప్ వచ్చింది. దీంతో డైరెక్షన్ పక్కన పెట్టి యాక్టర్‌గా ఎంట్రీ ఇవ్వాలి అనుకున్నారు.
 
శీనయ్య అనే సినిమాలో మెయిన్ లీడ్‌గా నటించడానికి ఒప్పుకోవడం.. షూటింగ్ స్టార్ట్ చేయడం జరిగింది కానీ.. కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్ట్ ఆగింది. ఇదిలా ఉంటే.. వినాయక్ చిరుతో లూసీఫర్ రీమేక్ చేయనున్నారు. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కథలో మార్పులుచేర్పులు చేసారు. చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
 
అయితే... ఆచార్య తర్వాత చిరంజీవి వినాయక్‌తో లూసీఫర్ రీమేక్ స్టార్ట్ చేస్తారో..? మెహర్ రమేష్‌తో వేదాళం రీమేక్ చేస్తారా..? అనేది ఇంకా ఫైనల్ కాలేదు. ఆచార్య షూటింగ్‌ని వచ్చే నెలలో స్టార్ట్ చేయనున్నారు. ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాతే నెక్ట్స్ ఏ సినిమా చేయాలి అనేది ఫైనల్ చేస్తారని సమాచారం.
 
అయితే.. వినాయక్ పుట్టినరోజు సందర్భంగా చిరు తనతో చేయనున్న మూవీని ఎనౌన్స్ చేస్తారని వినాయక్ ఆశించారట. ఆచార్య తర్వాత ఎవరితో సినిమా చేయాలో ఇంకా కన్ఫర్మ్ కాలేదు కనుక ఇప్పుడు ప్రకటించలేదు. వినాయక్ మాత్రం తన పుట్టినరోజు కానుకగా ఎనౌన్స్ చేస్తారనుకున్నారట. అలా... జరగకపోవడంతో ఫీలయ్యాడని టాక్.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments