Webdunia - Bharat's app for daily news and videos

Install App

భోళాశంకర్ నిర్మాతలకు రూ. 50 కోట్లు నష్టమా? కేసు పెట్టి వారి వెంటబడుతున్న డిస్ట్రిబ్యూటర్

Webdunia
శనివారం, 16 సెప్టెంబరు 2023 (21:36 IST)
మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ అయ్యింది. దీనితో ఆ చిత్రాన్ని నిర్మించిన అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర భారీగా రూ. 50 కోట్ల వరకూ నష్టపోయారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అసలే నష్టాలతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటే ఇప్పుడు ఆయా డిస్ట్రిబ్యూటర్స్ నిర్మాతలపై కేసులు పెట్టి తమ డబ్బును ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
 
తాజాగా ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ బత్తుల సతీష్ భోళాశంకర్ నిర్మాతలపై చీటింగ్ కేసు పెట్టారు. ఈ మేరకు నాంపల్లి కోర్టులో పిటీషన్ వేసాడు. తనను గతంలో అక్కినేని అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కుల విషయంలో మోసం చేసారనీ, ఆ సమయంలో వారికి రూ. 30 కోట్లు చెల్లించినట్లు వెల్లడించాడు. తనకు మూడు రాష్ట్రాల హక్కుల డిస్ట్రిబ్యూషన్ ఇస్తానని చెప్పి చివరికి వైజాగ్ మాత్రమే ఇచ్చారనీ, అదేమని అడిగితే భోళా శంకర్ విడుదలకి ముందు డబ్బు ముట్టజెపుతామన్నారని తెలిపారు. ఇప్పుడు ఆ డబ్బు గురించి అడిగేందుకు ప్రయత్నిస్తే తనతో మాట్లాడేందుకు కూడా వారు సిద్ధంగా లేరనీ, అందువల్ల వేరే మార్గం లేక కోర్టులో కేసు వేసినట్లు చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలుగు రాష్ట్రాల సమస్యల కోసం మంత్రుల ఉప సంఘం... డ్రగ్స్‌పై యుద్ధం... (Video)

హైదరాబాద్ ప్రజాభవన్‌లో తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం ప్రారంభం (వీడియో)

జూలై 22 నుంచి బడ్జెట్ సమావేశాలు... 23న బడ్జెట్ దాఖలు

బడలిక కారణంగా సరిగ్గా చర్చించలేక పోయా : జో బైడెన్

కేసీఆర్ మరో ఎమ్మెల్యే షాక్ : కాంగ్రెస్ గూటికి గద్వాల ఎమ్మెల్యే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments