Webdunia - Bharat's app for daily news and videos

Install App

భోళాశంకర్ నిర్మాతలకు రూ. 50 కోట్లు నష్టమా? కేసు పెట్టి వారి వెంటబడుతున్న డిస్ట్రిబ్యూటర్

Webdunia
శనివారం, 16 సెప్టెంబరు 2023 (21:36 IST)
మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ అయ్యింది. దీనితో ఆ చిత్రాన్ని నిర్మించిన అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర భారీగా రూ. 50 కోట్ల వరకూ నష్టపోయారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అసలే నష్టాలతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటే ఇప్పుడు ఆయా డిస్ట్రిబ్యూటర్స్ నిర్మాతలపై కేసులు పెట్టి తమ డబ్బును ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
 
తాజాగా ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ బత్తుల సతీష్ భోళాశంకర్ నిర్మాతలపై చీటింగ్ కేసు పెట్టారు. ఈ మేరకు నాంపల్లి కోర్టులో పిటీషన్ వేసాడు. తనను గతంలో అక్కినేని అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కుల విషయంలో మోసం చేసారనీ, ఆ సమయంలో వారికి రూ. 30 కోట్లు చెల్లించినట్లు వెల్లడించాడు. తనకు మూడు రాష్ట్రాల హక్కుల డిస్ట్రిబ్యూషన్ ఇస్తానని చెప్పి చివరికి వైజాగ్ మాత్రమే ఇచ్చారనీ, అదేమని అడిగితే భోళా శంకర్ విడుదలకి ముందు డబ్బు ముట్టజెపుతామన్నారని తెలిపారు. ఇప్పుడు ఆ డబ్బు గురించి అడిగేందుకు ప్రయత్నిస్తే తనతో మాట్లాడేందుకు కూడా వారు సిద్ధంగా లేరనీ, అందువల్ల వేరే మార్గం లేక కోర్టులో కేసు వేసినట్లు చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kodali Nani: కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై ఫోనులో ఆరా తీసిన జగన్.... ఆస్పత్రికి వెళ్లలేరా?

Polavaram: 2027 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి: చంద్రబాబు ప్రకటన

Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, కేటీఆర్‌ల జైలు కథలు..

Aarogyasri: ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్?

Putin: భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments