Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొమురం భీం జిల్లాలో పెద్దపులి.. ఇప్పటికే ఇద్దరు మృతి

Webdunia
శనివారం, 30 జనవరి 2021 (09:23 IST)
కొమురం భీం జిల్లాలో పెద్దపులి సంచారం ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. దహేగం మండలం రాంపూర్ అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తోంది. అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు అటవీ అధికారులు సూచించారు. దీంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికే జిల్లాలో పెద్దపులి పంజాకు ఇద్దరు గిరిజనులు మృతిచెందారు. 
 
గత నవంబరు 11న దహెగాం మండలం దిగిడ గ్రామానికి చెందిన విఘ్నేష్‌ అనే యువకుడిని పులి హతమార్చింది. అదేనెల 29న పెంచికలపేట మండలం కొండపెల్లికి చెందిన నిర్మల అనే బాలికను పొట్టన పెట్టుకుంది.
 
ఈ క్రమంలో రెండు నెలలుగా పెద్దపులిని పట్టుకునేందుకు అటవీశాఖ సిబ్బంది శ్రమిస్తున్నారు. జిల్లా ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న పెద్దపులిని బంధించేందుకు అటవీశాఖ తీవ్ర కసరత్తు చేస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harihara Veeramallu: పారితోషికం మొత్తం తిరిగి ఇచ్చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్?!!

షూటింగులకు వాడే డ్రోన్లతో కూల్చివేశారు - ఆర్జీవీ

34 మంది పిల్లలకు తల్లి అయిన ప్రీతి జింటా

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

Bunny Vas: బన్నీ వాస్ చిత్రం మ్యాడ్ నెస్ ముసుగు వ్యక్తుల కథేమిటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments