Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇంట్లోకి ప్రవేశించిన నల్లత్రాచు... చిన్నారులు మాత్రమే వుండటంతో..

ఇంట్లోకి ప్రవేశించిన నల్లత్రాచు... చిన్నారులు మాత్రమే వుండటంతో..
, శుక్రవారం, 25 డిశెంబరు 2020 (11:42 IST)
అర్ధరాత్రి వేళ ఓ నల్లత్రాచు కలకలం రేపింది. పాము ఇంట్లో దూరిన సమయంలో కేవలం చిన్నారులు మాత్రమే ఉండటంతో వారు వారు భయంతో వణికిపోయారు. ఈ ఘటన శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కాలనీలో చోటుచేసుకుంది. వివరాలు.. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధి ఎయిర్‌పోర్ట్ కాలనీలో నివాసం ఉంటే అక్బర్ అనే వ్యక్తి ఇంట్లోకి అర్ధరాత్రి వేళ నల్లత్రాచు పాము మెల్లగా దూరింది. ఇంట్లోకి దూరి హల్ చల్ చేసింది.

అయితే పాము ఇంట్లోకి వచ్చిన సమయంలో కేవలం చిన్న పిల్లలు మాత్రమే ఇంట్లో ఉన్నారు. దీంతో వారు పామును గమనించి గజగజ వణికిపోయారు. భయంతో కేకలు వేస్తూ పరుగులు తీశారు. వారి కేకలు విన్న కాలనీవాసులు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు.
 
నల్లత్రాచును చూసేందుకు పెద్ద సంఖ్యలో అక్బర్ నివాసం వద్దకు చేరుకున్నారు. జనాన్ని చూసిన పాము కదలకుండా అక్కడే నిలబడి పోయింది. కాసేపటికి అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీంతో అక్కడి వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల ఖమ్మంలో బైక్‌లో నుంచి బయటపడ్డ పాము.. కొద్ది రోజుల కిందట ఖమ్మం జిల్లాలో ఓ వ్యక్తి బైక్‌లో పాము కనిపించడం కలకలం రేపిన సంగతి తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అట్టహాసంగా తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్‌ వేడుకలు