Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రగ్స్ తరలిస్తూ పట్టుబడిన తెలుగు టెక్కీలు.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 31 మే 2022 (08:57 IST)
వర్క్ ఫ్రమ్ హోం పని చేస్తున్న కొందరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు డ్రగ్స్ తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. వారి నుంచి రూ.2.35 లక్షల విలువ చేసే డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ టెక్కీలు గోవా నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి హైదరాబాద్‌కు తరలించే క్రమంలో పెద్ద అంబర్ పేట వద్ద లారీ ఎక్కగా పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. ఏపీలోని కాకినాడ జిల్లా గొల్లలమామిడాడకు చెందిన వట్టూరి సూర్య సంపత్, రాజమండ్రికి చెందిన మోరంపూడి సూయినగర్‌కు చెందిన తీగల దీపక్ ఫణీద్ర అనే వారు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా పని చేస్తున్నారు. వీరింతా గత కొన్ని నెలలుగా రాజమండ్రిలో వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నారు. ఈ క్రమంలో మాదకద్రవ్యాలకు అలవాటుపడ్డారు. 
 
దీంతో ఈ నెల 25వ తేదీన గోవాలోని ఓ వ్యక్తి నుంచి ఎండీఎంఏ డ్రగ్స్ (25 మాత్రలు), ఎల్ఎస్డీ (2స్ట్రిప్పులు) కొనుగోలు చేసి బస్సులో గోవా నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఆ తర్వాత పెద్ద అంబర్ పేట వద్ద లారీ ఎక్కి రాజమండ్రికి చేరుకునేలా ప్లాన్ చేశారు. 
 
అయితే, వీరివద్ద డ్రగ్స్ ఉన్నట్టు పోలీసులకు సమాచారం తెలిసింది. దీంతో పోలీసులు నిఘా వేసి ఈ ఇద్దరు టెక్కీలను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.2.35 లక్షల విలువ చేసే డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments