Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎమ్మెల్సీ చేతిలో హత్యకు గురైన మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం భార్యకు ఉద్యోగం

anantha babu
, ఆదివారం, 29 మే 2022 (13:38 IST)
ఏపీలో అధికార వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు చేతిలో హత్యకు గురైన ఆయన కారు మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం భార్య అపర్ణతు ప్రభుత్వం ఉద్యోగం లభించింది. ఈ మేరకు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ ఎం. విక్టర్ ప్రసాద్ శనివారం ఉద్యోగ నియామక పత్రాన్ని అందజేశారు. 
 
కాకినాడ జిల్లా జి.మామిడాలలో సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించి, అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ హామీలో భాగంగా, అపర్ణకు ఆరోగ్య శాఖలో ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వడంతో పాటు ఆయన సోదరుడు నవీన్‌కు ఒప్పంద ఉద్యోగం ఇస్తామని పేర్కొన్నారు. 
 
అలాగే, మామిడాడలోని జగనన్న కాలనీలో సుబ్రహ్మణ్యం భార్య, తల్లికి సెంటున్నర ఇంటి స్థలం కేటాయిస్తూ పట్టాలు అందించారు. ఆ స్థలంలో ప్రభుత్వమే ఇళ్ళు కట్టి ఇస్తుందని విక్టర్ ప్రసాద్ తెలిపారు. అలాగే, సుబ్రహ్మణ్యం కుటుంబానికి ఇప్పటికే రూ.8.25 లక్షలు మంజూరైనట్టు ఆయన వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒకటి రెండు అత్యాచారాలకే రాద్దాంతమా? మంత్రి ఆర్.కె.రోజా