Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖమ్మం జిల్లాలో బోల్తాపడిన ట్రాక్టర్ ... నలుగురు దుర్మరణం

Webdunia
ఆదివారం, 17 అక్టోబరు 2021 (13:06 IST)
తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. దుర్గాదేవి విగ్రహ నిమజ్జన ఉత్సవానికి భక్తులు ట్రాక్టర్‌పై వెళ్తున్న సమయంలో అది ఒక్కసారిగా బోల్తాపడింది. 
 
ముదిగొండ మండలం బాణాపురం వద్ద జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108 అంబులెన్సులో సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
 
కమలాపురం నుంచి అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు మున్నేరు నదికి తరలించారు. ఒక ట్రాక్టర్‌లో విగ్రహం ఉంచగా, వెనుక ఉన్న మరో ట్రాకట్ర్ వల్లభి వైపు వెళ్లింది. అయితే, ట్రాక్టర్ అతివేగానికి తోడు వర్షం కురుస్తుండటంతో అయ్యగారిపల్లి వద్ద బోల్తాపడింది. ప్రమాద సమయంలో ట్రాక్టర్ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments