Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: తొమ్మిది మంది మృతి

Advertiesment
ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: తొమ్మిది మంది మృతి
, గురువారం, 7 అక్టోబరు 2021 (12:17 IST)
ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏకంగా తొమ్మిది మంది మృతి చెందారు. యూపీలోని బారాబంకి జిల్లాలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఢిల్లీ నుండి లక్నో మీదుగా వెళ్తున్న ఓ టూరిస్ట్ బస్సును దేవా కొత్వాల్ సమీపంలో ఓ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో తొమ్మిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. అంతేకాకుండా బస్సులో ఉన్న 27 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
 
మృతుల కుటుంబాలకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం రెండు లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. ఇక ఈ ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపం ప్రకటించారు. బస్సులో ఉన్న ప్రయాణికులు అంతా ఒకే ప్రాంతానికి చెందిన వారిగా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం గాయాలపాలైన వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆదేశించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉపరాష్ట్రపతిగా కేసీఆర్ - తెలంగాణ సీఎంగా కేటీఆర్