Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాగిన మైకంలో భార్యను తుపాకీతో కాల్చిన భర్త.. చివరకు...

Webdunia
ఆదివారం, 17 అక్టోబరు 2021 (11:30 IST)
అనుమానం పెనుభూతమైంది. దీనికితోడు పీకలవరకు మద్యం సేవించాడు. ఈ మైకంలో ఏం చేస్తున్నాడో అతనికే అర్థం కాలేదు. అంతే.. నాటు తుపాకీతో భార్యపై కాల్పులు జరిపాడు. దీంతో భార్య చనిపోయింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలంలోని భరణికోట కాలనీ అనే గిరిజన తండాలో వెలుగులోకి వచ్చింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, భరణికోట కాలనీకి చెందిన జగ్గరావు, సవర పద్మ(33) అనే దంపతులు ఉండగా, వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, భార్యపై అనుమానంతో జగ్గారావు లోలోన కుమిలిపోతున్నాడు. దీంతో ఆ దంపతుల మధ్య తరచుగా గొడవలు జరుగుతూ వచ్చాయి. 
 
ఈ క్రమంలో మద్యం తాగొచ్చి రోజూ వేధింపులకు పాల్పడతుండేవాడు. శనివారం మధ్యాహ్నం కూడా ఇద్దరి మధ్య వివాదం జరిగింది. అప్పటికే మత్తులో ఉన్న జగ్గరావు తన వద్దనున్న నాటు తుపాకీతో పద్మను కాల్చాడు. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందింది.
 
కాగా గ్రామానికి చెందిన వ్యక్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం పద్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు మెళియాపుట్టి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anna konidala: డిక్లరేషన్ పై సంతకం పెట్టి స్వామి కి మొక్కులు చెల్లించుకున్న అన్నా కొణిదల

ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

Sathyaraj: ఆకట్టుకునేలా త్రిబాణధారి బార్బారిక్‌ లో తాత, మనవరాలి సాంగ్ : సత్యరాజ్

Rajamouli : ఆస్కార్‌ కేటగిరిలో స్టంట్ డిజైన్ వుండడం పట్ల రాజమౌళి హర్షం

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments