Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాగిన మైకంలో భార్యను తుపాకీతో కాల్చిన భర్త.. చివరకు...

Webdunia
ఆదివారం, 17 అక్టోబరు 2021 (11:30 IST)
అనుమానం పెనుభూతమైంది. దీనికితోడు పీకలవరకు మద్యం సేవించాడు. ఈ మైకంలో ఏం చేస్తున్నాడో అతనికే అర్థం కాలేదు. అంతే.. నాటు తుపాకీతో భార్యపై కాల్పులు జరిపాడు. దీంతో భార్య చనిపోయింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలంలోని భరణికోట కాలనీ అనే గిరిజన తండాలో వెలుగులోకి వచ్చింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, భరణికోట కాలనీకి చెందిన జగ్గరావు, సవర పద్మ(33) అనే దంపతులు ఉండగా, వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, భార్యపై అనుమానంతో జగ్గారావు లోలోన కుమిలిపోతున్నాడు. దీంతో ఆ దంపతుల మధ్య తరచుగా గొడవలు జరుగుతూ వచ్చాయి. 
 
ఈ క్రమంలో మద్యం తాగొచ్చి రోజూ వేధింపులకు పాల్పడతుండేవాడు. శనివారం మధ్యాహ్నం కూడా ఇద్దరి మధ్య వివాదం జరిగింది. అప్పటికే మత్తులో ఉన్న జగ్గరావు తన వద్దనున్న నాటు తుపాకీతో పద్మను కాల్చాడు. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందింది.
 
కాగా గ్రామానికి చెందిన వ్యక్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం పద్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు మెళియాపుట్టి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

రజనీకాంత్ "కూలీ" నుంచి కీలక అప్‌డేట్... ట్రైలర్ రిలీజ్ ఎపుడంటే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments